వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో రాబోయే లోక్ సభ సీట్లు.. 24 నుంచి 25.! అయినా, ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో అంటే, ఇరవై నాలుగున్నర అనుకోవాలా.? అంతేనేమో.!
సర్వే చేస్తున్న సంస్థ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల్ని పత్రికా ప్రకటనల రూపంలో పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కల్పించేందుకు నేషనల్ మీడియాకి జరుగుతున్న చెల్లింపుల ప్రసహనంలో ఇదీ ఓ భాగం.
అయినా, ప్రభుత్వానికి ప్రచారమెందుకు.? మంచి జరిగితే, జనం మాట్లాడుకుంటారు కదా.? ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడమంటే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి వుండదు. ఇదో రకం దోపిడీ అని అనుకోవచ్చు. కానీ, అన్ని ప్రభుత్వాలూ ఈ దోపిడీని నిర్లజ్జగా చేస్తున్నాయ్.!
ఇక, సర్వే గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, 2019 ఎన్నికలోనే వైసీపీ గెలుచుకున్నది 22 ఎంపీ సీట్లు. అందులోంచి ఒకటి ఔట్ మళ్ళీ.! 2019 నాటి పొలిటికల్ వేవ్, ఇప్పుడు వైసీపీకి అసాధ్యం. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీనీ జనాలు మళ్ళీ నమ్మే పరిస్థితి లేకుండా చేసేశారు వైసీపీ అధినేత.!
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమేంటి.? ఈ ప్రశ్న రాష్ట్ర ప్రజలకు ప్రతిసారీ అవమానకరంగా మారుతోంది.. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు. ‘అలా ఎలా గెలిపించారు.?’ అనడుగుతోంటే, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడంలేదు మరి.! మళ్ళీ గెలిపిస్తారా.? అయితే, ఈసారి ఏం లేపేస్తాడో.? అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది రాష్ట్ర ప్రజలకి.
మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, వైసీపీకి షాక్ తగిలింది. ‘మా ఓటర్లు వేరు’ అని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి బుకాయించాల్సి వచ్చింది. ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.
పలువురు మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు, తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు ఎలా వస్తాయ్.? బహుశా వైసీపీకి వేరే ఓటర్లు వున్నారేమో?! లేదంటే, ఆ సర్వే, వేరే ఓటర్లతో చేయించుకున్నారేమో.!
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అందుకే, ఇలాంటి ఫేక్ సర్వేలు వెలుగు చూస్తున్నాయ్. ప్రజా ధనం గట్టిగా మేసేస్తున్నారు కదా.. ఇలాంటి ఫేక్ సర్వేలతో అయినా, సోకాల్డ్ పెద్దలనబడే గద్దల్ని మెప్పించకపోతే ఎలా.?
టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి.! కానీ, విడివిడిగానే ఆయా సర్వేల్లో రెండు పార్టీల ఓటు బ్యాంకుల్ని ప్రస్తావించడమంటేనే, ఇవి పనికిమాలిన సర్వేలని అర్థం. ఆ సర్వేలు అలా రావడం.. వాటిని పేటీఎం బ్యాచ్ ప్రచారంలోకి తీసుకురావడం.. ఇదో ప్రసహనం మళ్ళీ.!
వీటి కోసం మళ్ళీ పెయిడ్ మీడియా.! రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రజాధనం ఇంతలా దుర్వినియోగమవుతుండడాన్ని ఏమనుకోవాలి.?