Switch to English

నవ్విపోదురుగాక.! ప్రతిసారీ నవ్వులపాలైపోతున్న వైసీపీ ‘పెయిడ్’ సర్వే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో రాబోయే లోక్ సభ సీట్లు.. 24 నుంచి 25.! అయినా, ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో అంటే, ఇరవై నాలుగున్నర అనుకోవాలా.? అంతేనేమో.!

సర్వే చేస్తున్న సంస్థ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల్ని పత్రికా ప్రకటనల రూపంలో పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కల్పించేందుకు నేషనల్ మీడియాకి జరుగుతున్న చెల్లింపుల ప్రసహనంలో ఇదీ ఓ భాగం.

అయినా, ప్రభుత్వానికి ప్రచారమెందుకు.? మంచి జరిగితే, జనం మాట్లాడుకుంటారు కదా.? ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడమంటే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి వుండదు. ఇదో రకం దోపిడీ అని అనుకోవచ్చు. కానీ, అన్ని ప్రభుత్వాలూ ఈ దోపిడీని నిర్లజ్జగా చేస్తున్నాయ్.!

ఇక, సర్వే గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, 2019 ఎన్నికలోనే వైసీపీ గెలుచుకున్నది 22 ఎంపీ సీట్లు. అందులోంచి ఒకటి ఔట్ మళ్ళీ.! 2019 నాటి పొలిటికల్ వేవ్, ఇప్పుడు వైసీపీకి అసాధ్యం. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీనీ జనాలు మళ్ళీ నమ్మే పరిస్థితి లేకుండా చేసేశారు వైసీపీ అధినేత.!

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమేంటి.? ఈ ప్రశ్న రాష్ట్ర ప్రజలకు ప్రతిసారీ అవమానకరంగా మారుతోంది.. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు. ‘అలా ఎలా గెలిపించారు.?’ అనడుగుతోంటే, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడంలేదు మరి.! మళ్ళీ గెలిపిస్తారా.? అయితే, ఈసారి ఏం లేపేస్తాడో.? అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది రాష్ట్ర ప్రజలకి.

మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే, వైసీపీకి షాక్ తగిలింది. ‘మా ఓటర్లు వేరు’ అని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి బుకాయించాల్సి వచ్చింది. ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.

పలువురు మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు, తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు ఎలా వస్తాయ్.? బహుశా వైసీపీకి వేరే ఓటర్లు వున్నారేమో?! లేదంటే, ఆ సర్వే, వేరే ఓటర్లతో చేయించుకున్నారేమో.!

నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అందుకే, ఇలాంటి ఫేక్ సర్వేలు వెలుగు చూస్తున్నాయ్. ప్రజా ధనం గట్టిగా మేసేస్తున్నారు కదా.. ఇలాంటి ఫేక్ సర్వేలతో అయినా, సోకాల్డ్ పెద్దలనబడే గద్దల్ని మెప్పించకపోతే ఎలా.?

టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి.! కానీ, విడివిడిగానే ఆయా సర్వేల్లో రెండు పార్టీల ఓటు బ్యాంకుల్ని ప్రస్తావించడమంటేనే, ఇవి పనికిమాలిన సర్వేలని అర్థం. ఆ సర్వేలు అలా రావడం.. వాటిని పేటీఎం బ్యాచ్ ప్రచారంలోకి తీసుకురావడం.. ఇదో ప్రసహనం మళ్ళీ.!

వీటి కోసం మళ్ళీ పెయిడ్ మీడియా.! రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రజాధనం ఇంతలా దుర్వినియోగమవుతుండడాన్ని ఏమనుకోవాలి.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...