పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు పవన్ కళ్యాణ్. కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి ఒక సినిమా విడుదలైపోయేది కూడా. మిగిలిన రెండు సినిమాల షూటింగ్స్ ను కూడా మొదలుపెట్టేవాడు. ముందుగా వకీల్ సాబ్ షూటింగ్ ను త్వరగా మొదలుపెట్టి నెల రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు.
ఇక ఈ మూడు చిత్రాలు కాకుండా పవన్ కళ్యాణ్ మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ పై ఆసక్తి ప్రదర్శిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాపై ఆసక్తి ప్రదర్శిస్తున్న దగ్గరనుండి ఈ చిత్రానికి దర్శకుడ్ని కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. కొంత మంది దర్శకుల పేర్లు అనుకున్నా సెట్ అవ్వలేదు. చివరికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ)ను దర్శకుడిగా రెఫెర్ చేసినట్లు సమాచారం.
నిజానికి డాలీ వేరే కథను పవన్ కోసం సిద్ధం చేస్తున్నాడు. ఈలోగా పవన్ నుండే కబురు రావడంతో డాలీ కూడా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో దర్శకుడిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
731889 889755hi great page i will definaely come back and see once more. 333680
702826 113006Perfectly composed content , thankyou for entropy. 627212