గతేడాది నుండి బాలీవుడ్ కొన్ని వందల కోట్ల రూపాయలను కోల్పోయింది. కరోనా ఫస్ట్ వేవ్ శాంతించింది అనుకుంటే సెకండ్ వేవ్ మరింత భయంకరంగా తయారైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు ఎక్కడివక్కడ నిలిచిపోతే ఇప్పుడు తౌక్తే తుఫాను మరింత డ్యామేజ్ చేస్తోంది.
ముంబైలో ఈ తుఫాను దెబ్బకు సర్వం నాశనమైంది. ముంబై శివార్లలో పలు సినిమాల సెట్స్ ను ఓపెన్ ప్రదేశాల్లో నెలకొల్పారు. అవి ఇప్పుడు తుఫాను తాకిడికి ధ్వంసం అయింది. అజయ్ దేవగన్ హీరోగా ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో మైదాన్ చిత్రం రూపొందుతోంది. ఇందుకోసం పెద్ద స్టేడియం సెట్ ను వేశారు. అందులో 8 మ్యాచ్ లను చిత్రీకరించాల్సి ఉంది. కానీ నాలుగు మ్యాచ్ ల తర్వాత కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ ను నిలిపివేశారు.
ఇప్పుడు తుఫాను తాకిడి మైదాన్ సెట్ మొత్తం పాడైపోయింది. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3, రన్బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సెట్స్ కూడా పాక్షికంగా దెబ్బయ్యాయి.