బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలంటూ పలువురు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ వేర్పాటు రాజకీయాలకు సిద్ధమవుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రయత్నాల్ని అడ్డుకుంటానని.. అవసరమైతే తన రక్తం చిందిస్తానే కానీ రాష్ట్రాన్ని విడిపోనివ్వనని తేల్చి చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘ఉత్తర బెంగాల్ లోని కొన్ని వర్గాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు. బీజేపీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఓసారి గూర్ఖాలాండ్.. మరోసారి ఉత్తర బెంగాల్ అంటూ రెచ్చగొడుతొంది. ప్రత్యేక కాంతాపూర్ ను మమతా వ్యతిరేకిస్తే ఆమె రక్తం కళ్లచూస్తామంటూ కాంతాపూర్ లిబరేషన్ సంస్థ ఆమధ్య బెదిరింపులకు పాల్పడింది. దీనిపై మమతా స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులు నన్నేమీ చేయలేవు. కొందరు నన్ను బెదిరిస్తున్నారు. అయినా బెదిరేది లేదు. రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు కానివ్వను’ అని మమత అన్నారు.
905093 795469I really treasure your piece of work, Fantastic post. 790454
571447 727294I dont generally comment but I gotta say thankyou for the post on this wonderful one : D. 395111
491035 77040Just a smiling visitant here to share the love (:, btw outstanding style . 934982