తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సమయంలో వారికి ఆర్ధిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. నెలకు 2 వేలతో పాటు 25కిలోల బియ్యం ఇవ్వాలని కేసీఆర్ ఈ సందర్భంగా నిర్ణయించారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లు, సిబ్బందికి ఈ సాయం వర్తిస్తుందని ప్రకటించారు. టీచర్లు, సిబ్బంది బ్యాంక్ అకౌంట్ వివరాలను కలెక్టర్లకు సమర్పించాలని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని లక్షా 45 వేల మంది ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. కరోనా సమయంలో ఉపాధ్యాయుల కుటుంబాలను మానవీయ కోణంలో ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రకటించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.
795931 661752I dont leave plenty of comments on a lot of blogs each week but i felt i had to here. A hard-hitting post. 8710
260265 15318There exist a couple of several different distinct levels among the California Weight loss program and each and every a person is pretty essential. Youre procedure stands out as the the actual giving up with all of the power. weight loss 594738
829879 785788I like this weblog so a lot, saved to my bookmarks . 635774
6619 32045I besides believe therefore , perfectly composed post! . 436728