ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరాటానికి తెలంగాణ రైతులు సిద్ధంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. అంతిమ విజయం సాధించే వరకూ విశ్రమించేది లేదు. తెలంగాణలో కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 30లక్షల బోర్లు ఉన్నాయి. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.
‘ధాన్యం పండించండి.. కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు అన్నారు. ఇప్పుడు పియూష్ గోయెల్ తెలంగాణ రైతులు నూకలు తినాలంటున్నారు. మేం అడుక్కోవడానికి వచ్చామా..? ఆయన పియూష్ గోయెల్ కాదు.. పియూష్ గోల్ మాల్. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. ధాన్యం కొనుగోలుపై దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. బీజేపీ నేతలు నిస్సిగ్గుగు వ్యవహరిస్తూ.. హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నారు. రైతుల కోసం అవమానాలు భరిస్తున్న టికాయత్ కు అండగా ఉంటాం. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రెండు చేతులు జోడించి కోరుతున్నా’ అని అన్నారు.
418189 166648Very informative post. Your current Web site style is awesome as properly! 366286
72947 614399What is your most noted accomplishment. They may possibly want very good listeners rather than excellent talkers. 106412