మెగాస్టార్ చిరంజీవి కి పెద్ద ప్రమాదం తప్పింది ? ముంబై నుండి హైదరాబాద్ బయలుదేరిన విస్తార విమానం టేక్ అఫ్ అయిన అరగంటలోనే సాంకేతిక లోపం రావడంతో తిరిగి ముంబై లో అత్యవసరంగా ల్యాండ్ చేసారు. ఈ విమానంలో మొత్తం 120 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో మెగాస్టార్ కూడా ఉండడం అందరికి షాక్ ఇచ్చింది.
ఆ వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి ముంబై నుండి హైద్రాబాద్ రావడానికి విస్తార విమానంలో ఎక్కారు. ఆ విమానం బయలుదేరి టేక్ ఆఫ్ అయింది .. ఆ వెంటనే అందులో సమస్య ఉందని గుర్తించిన పైలట్ వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. దాంతో ఆ విమానాన్ని అత్యవసరంగా తిరిగి ముంబై లోనే ల్యాండ్ చేసారు. విమానంలో ఉన్న మెగాస్టార్ కు సంబందించిన ఫోటోను ఓ ప్రయాణికుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో న్యూస్ సంచలనం అయింది.
846542 949946Wow! Thank you! I always wanted to write on my web site something like that. Can I consist of a portion of your post to my internet site? 949394
638120 589453Rattling outstanding info can be identified on web blog . 811511