Chiranjeevi: ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య (Ayodhya) లో నిర్మిస్తున్న రామ మందిరం (Ram mandir) ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 జనవరి 22న జరిగే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఈక్రమంలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కి ఆహ్వానం అందింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం అందుకున్నది చిరంజీవి మాత్రమే కావడం విశేషం.
రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న సినీ ప్రముఖుల్లో తమిళం నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన అల్లుడు థనుష్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సంచలన హీరో రిషిబ్ శెట్టి ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుమప్ ఖేర్, అక్షయ్ కుమార్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి ఉన్నారు. క్రికెటర్లు సచిన్, కోహ్లీ, పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ కూడా ఉన్నారు.