మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను దాదాపు పూర్తి చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఆచార్య పూర్తైన కొన్ని రోజులకే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా లూసిఫెర్ రీమేక్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు చిరంజీవి. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్ చేయగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రీసెంట్ గా బాబీ ఈ చిత్రం గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. దసరా నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలియజేసాడు బాబీ.
చిరంజీవి స్టార్డంకు ఈ చిత్రం సరైన నిరాజనమని, తాను చిరంజీవికి అతి పెద్ద ఫ్యాన్ అని, ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతుండడం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలియజేసాడు.
303167 952746Very clean website , thanks for this post. 108327
40415 548694You completed various very good points there. I did a search on the theme and found the majority of folks will consent together with your blog. 804414