Chiranjeevi: దాదాపు 500ఏళ్ల నాటి కల.. అయోధ్య (Ayodhya) లో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతావని పులకించిపోయింది. ఇటువంటి క్రతువుకు ఆహ్వానం అందుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి (Chiranjeevi). తనయుడు రామ్ చరణ్ (Ram Charan) కు కూడా రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది. వారి ప్రయాణానికి ముందు మెగా ఫ్యాన్స్ వీడ్కోలు పలికారు. అయోధ్యకు మీరే మా ప్రతినిధి అని.. హనుమయ్య ప్రతిమలు అందజేశారు. ఈరోజు ఉదయం చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్ సంప్రదాయ దుస్తుల్లో అయోధ్యకు ప్రత్యేక విమానంలో తరలి వెళ్లారు.
అయోధ్యలో ఆలయ ప్రతినిధులు వారికి స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో వారికి కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ తో రిలయన్స్ అధిపతుల్లో ఒకరైన అనిల్ అంబానీ చాలాసేపు ముచ్చటించారు. ఈ వీడియోలు.. చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, నాటి పరుగుల రాణి పీటీ ఉష ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది. అంతకుముందు విమానాశ్రయంలో చిరంజీవి, రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
• @ANI Cameraman : “Ye Abhi RamCharan ki Pita hei isliye inko Frame Mei Rakha hua hei, #RamCharan ke Father Hei” 🥹🥹@AlwaysRamCharan 🫡 pic.twitter.com/sdt16LuFBu
— Raees (@RaeesHere_) January 22, 2024