Switch to English

చంద్రబాబు లేఖతో ‘3 రాజధానుల’ ఎపిసోడ్‌ ఆగుతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి ఓ లేఖ రాశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు శాసన ఆమోదం లభించిందనీ, వాటికి ఆమోదం తెలపాలని కోరుతూ ప్రభుత్వం ఆయా బిల్లుల్ని గవర్నర్‌ వద్దకు పంపిన విషయం విదితమే. అయితే, గవర్నర్‌ ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయకూడదని అంటోంది టీడీపీ. ఈ మేరకు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి, ‘విభజన చట్టం ప్రకారం అది అన్యాయం, అక్రమం..’ అంటున్నారు.

తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, సుదీర్ఘంగా ఈ విషయమై గవర్నర్‌కి లేఖ రాశారు. విభజన చట్టంలో ‘రాజధాని’ అని మాత్రమే వుందనీ, మూడు రాజధానులు విభజన చట్టానికి వ్యతిరేకం.. అని ఆ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. అంతే కాదు, శాసన మండలిలో బిల్లు పాస్‌ అవలేదనీ, శాసన మండలి ఛైర్మన్‌, ఈ బిల్లులపై సెలక్ట్‌ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారనీ, ప్రభుత్వం శాసన మండలి ఛైర్మన్‌ ఆదేశాల్ని ధిక్కరించిందనీ చంద్రబాబు తన లేఖలో గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. అయితే, అసెంబ్లీలో రెండోసారి పాస్‌ చేయించి, శాసన మండలికి కూడా రెండో సారి బిల్లు పంపిన దరిమిలా, నెల రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా ఆ బిల్లులు ఆమోదం పొందినట్లేనని ప్రభుత్వం చెబుతోంది.

మరోపక్క, 3 రాజధానుల అంశాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, వామపక్షాల నేతలు కూడా నినదిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్‌కి లేఖలు కూడా రాస్తుండడం గమనార్హం. ఇంతటి గందరగోళం నడుమ గవర్నర్‌, మూడు రాజధానుల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ‘గవర్నర్‌ నిర్ణయం లాంఛనమే..’ అని ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. అతి త్వరలో అమరావతి నుంచి పలు శాఖల్ని విశాఖకీ, ఇంకొన్ని శాఖల్ని కర్నూలుకీ తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ నిర్ణయం ఎలా వుండబోతోందన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో కన్పిస్తోంది. గవర్నర్‌ ఆ బిల్లుల్ని ఆమోదించినా, తమ పోరాటం ఆగబోదని టీడీపీ సహా ఇతర విపక్షాలు చెబుతున్న దరిమిలా.. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఇంకెంత వేడిని సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

చంద్రబాబు లేఖతో ‘3 రాజధానుల’ ఎపిసోడ్‌ ఆగుతుందా.? చంద్రబాబు లేఖతో ‘3 రాజధానుల’ ఎపిసోడ్‌ ఆగుతుందా.? చంద్రబాబు లేఖతో ‘3 రాజధానుల’ ఎపిసోడ్‌ ఆగుతుందా.? చంద్రబాబు లేఖతో ‘3 రాజధానుల’ ఎపిసోడ్‌ ఆగుతుందా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...