కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే విషయంలో టీడీపీ అధినేత దాదాపుగా సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. ఈనెల 21 లేదా 22న విపక్ష పార్టీల సమావేశానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందుగానే విపక్షాల భేటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ముందు నుంచీ పట్టుదలగా ఉన్నారు. అయితే, ఈ విషయంలో ఆయనకు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాయావతి నుంచి తొలుత ఝలక్ తగిలింది. ఫలితాలు రాకముందే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తానంటూ చంద్రబాబు చెప్పడంపైనా ఆమె గుస్సా అయినట్టు సమాచారం. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం తన పట్టు వీడలేదు. ఎలాగైనా కాంగ్రెస్ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు పార్టీల అధినేతలను కలుస్తూ.. వారిని ఒప్పించే పనిలో పడ్డారు.
తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత లక్నో వెళ్లి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫలితాల కంటే ముందుగానే విపక్షాలు సమావేశం కావాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు. ఫలితాల కంటే ముందుగానే విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి ఆహ్వానం పొందడం సులభం అవుతుందని వివరించినట్టు సమాచారం. అందువల్లే ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితాలు విడుదలయ్యే 23వ తేదీ కంటే ముందుగానే విపక్ష పార్టీలన్ని కలిసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు అఖిలేష్, మయావతి కూడా అంగీకరించినట్టు సమాచారం. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా బెట్టు వీడి ఈ సమావేశానికి హాజరైతే అది బీజేపీకి ఎదురుదెబ్బగానే భావించక తప్పదు.
వాస్తవానికి విపక్షాల్లోని అనైక్యతే ఇన్నాళ్లూ బీజేపీ బలంగా ఉంటూ వచ్చింది. అయితే, మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఒకటి కావడం ప్రారంభించాయి. యూపీలో బద్ధ శత్రువులగా ఉన్న ఎస్సీ, బీఎస్పీ కలసి పోటీచేయడం ఇందుకు నిదర్శనం. అలాగే వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో, వారితో చర్చలు జరపడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో తన పరిచయాల్ని వినియోగించుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి రావడానికి అవకాశం ఉన్న ప్రతి పార్టీని కూడా ఒప్పించడానికి శతధా కృషి చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే కూడా చంద్రబాబే ఎక్కువ కష్టపడ్డారు. ఆ పార్టీ నేతలు చేయాల్సిన పనిని బాబు ఒక్కరే చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కితే మాత్రం కచ్చితంగా ఆ క్రెడిట్ మాత్రం బాబుదే అని విశ్లేషకులు అంటున్నారు.
విపక్షాలను ఏకం చేయడంతోపాటు ప్రధాని పదవి విషయంలో కాంగ్రెస్ కాస్త వెనక్కి తగ్గేలా కూడా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. వాస్తవానికి ప్రదాని పదవిపై చాలామంది కన్నేశారు. ఇదే వారిలో ఐక్యతకు అడ్డంకిగా మారింది. ముఖ్యంగా మమతా బెనర్జీ కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ సందర్భంలో బాబు తన రాజకీయ చతురతను ఉపయోగించి వారందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ కు 140 కంటే ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీకి, అంతకంటే తక్కువ వస్తే కూటమిలోని ఇతర పార్టీలకు ప్రధాని పదవి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్టుగా చెబుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ సమ్మతించినట్టు సమాచారం. దీంతోనే విపక్షాల భేటీ దాదాపుగా ఖరారైందని అంటున్నారు. మొత్తమ్మీద 21 లేదా 22న ఈ పార్టీల సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది.
62143 939453What a lovely weblog page. I will certainly be back again. Please maintain writing! 205726
155791 193126Extremely fascinating topic , appreciate it for putting up. 301307
860517 334510Hi my friend! I want to say that this post is awesome, good written and include almost all significant infos. Id like to see far more posts like this . 309666