గన్నవరం ఘటనలో బాధితులైన తెలుగుదేశం నేతలనే నిందితులుగా చేసి అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గన్నవరం ఘటనపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్ రాజకీయ కక్షలకు పోలీసులు పావుల్లా మారుతున్నారని.. కేసులు పెట్టేందుకు అర్హత లేకోపోయినా క్రిస్టియన్ అయిన గన్నవరం సీఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించారని అన్నారు. తప్పుడు కేసులకు ఇదే ఉదాహరణ అని అన్నారు. దాడులకు గన్నవరం ఎమ్మెల్యే వ్యూహరచన చేసారని అన్నారు.
దాడులన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయినా. పక్కా ఆధారాలున్నా ఘటనకు కారకులైన వారిపై చర్యలు లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఘటనలో కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్లు ఉపయోగించినా వారిపై కాకుండా 40మందికి పైగా టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి కస్టడీలో దారుణంగా హింసించారని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి, ప్రజాస్వామ్యానికి నియంత పోకడల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. అందరం కలసి రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని అన్నారు.
458164 312658Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this incredible like you organize your company at the moment. educational 959024
937633 344659wonderful post. Neer knew this, thanks for letting me know. 310804