తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని ‘జాతి’ నాయకుడిగా మార్చేశారు వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎవరో అన్నారని, తెలుగుదేశం పార్టీ అధినేత స్థాయి తగ్గిపోతుందనుకోవడం హాస్యాస్పదం. అయితే, తెలుగు జాతి ఆత్మగౌరవం.. అనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు హయాంలో ‘మకిలి’ పట్టిందన్నది నిర్వివాదాంశం.
ఒకప్పటి తెలుగుదేశం పార్టీ వేరు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వేరు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేని దెబ్బ తినేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఆ మాటకొస్తే, 2009 నుంచే ఈ పతనం ప్రారంభమయ్యింది. తొలుత తెలంగాణలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ భ్రష్టుపట్టిపోయింది. దానికి కారణాలు చాలానే వున్నాయి. అందులో చంద్రబాబు పాత్ర తక్కువేమీ కాదు.
అయినాగానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జాతీయ స్థాయిలోనూ ఒకప్పుడు చక్రం తిప్పారాయన. చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ‘జాతి’ నేత అనడం దుర్మార్గం.
అయితే, రాజకీయాల్లో విమర్శల స్థాయి అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి చేరుకుంది గనుక, దీన్ని మరీ పెద్ద విషయంగా చూడాల్సిన పనిలేదేమో. కానీ, చంద్రబాబు మీద విమర్శలు చేసే నైతిక హక్కు విజయసాయిరెడ్డికి వుందా.? అన్నదే ప్రశ్న ఇక్కడ. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ‘ఏ2’ నిందితుడిగా వున్న విజయసాయిరెడ్డికి, ఆ కోణంలోనే ‘నామినేటెడ్’ పదవి దక్కింది తప్ప, ఆయన ఏనాడూ ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకోలేదాయె.
అలాంటి వ్యక్తి చంద్రబాబుని విమర్శించడమేంటన్నది తెలుగుదేశం పార్టీ వాదనగా కన్పిస్తోంది. అయితే, ప్రత్యర్థులు చేసే విమర్శలపై ఎదురుదాడి చేయడం తప్ప.. పార్టీ బాగు కోసం కనీసపాటి ప్రయత్నం చేయని తెలుగు తమ్ముళ్ళే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తీసుకొచ్చారన్నది నిర్వివాదాంశం.
555548 948399I always was concerned in this subject and stock nonetheless am, regards for posting . 657717
916714 393770I found your weblog website on google and check a couple of of your early posts. Proceed to sustain up the quite very good operate. I just extra up your RSS feed to my MSN News Reader. Looking for ahead to reading extra from you later on! 256152