‘అవకాశం వచ్చినప్పడల్లా విశాఖను ముందు వరుసలో నిలబెట్టేందుకు ప్రయత్నించాం.. విశాఖను ప్రపంచ పటంలో పెట్టాం..’ అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. నిజమేనా.? విశాఖను చంద్రబాబు అంతలా ఉద్ధరించేస్తే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎందుకు విశాఖ ఆదరించలేకపోయిందన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, విశాఖకు రాజధానిగా అవకాశం వచ్చింది. నిజానికి, అప్పటికి హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి నగరం అంటే విశాఖ మాత్రమే. అప్పటికీ, ఇప్పటికీ.. ఇదే వాస్తవం. కానీ, విశాఖను పక్కన పెట్టి, ‘కమ్మ’ లాబీయింగ్ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ప్రకటించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.
సరే, విశాఖ.. రాష్ట్రానికి ఓ చివర్న వుంటుందనే వాదనని కొట్టిపారేయలేం. అంతమాత్రాన విశాఖకు రాజధానిగా అర్హత లేదన్నదీ సబబు కాదు. వేరే గత్యంతరం లేదు.. అభివృద్ధి చెందిన నగరం రాజధాని అయితే, రాష్ట్రానికి ఆర్థికంగా ఆ నగరమే ఊతమిస్తుందన్న కనీసపాటి విజ్ఞతనూ చంద్రబాబు పాటించలేదు.
నిజానికి, విశాఖ మీద చంద్రబాబు కుట్ర పన్నారన్న అప్పటి ప్రతిపక్షం వైసీపీ విమర్శల్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఇప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నానా హంగామా చేస్తున్నారు. విశాఖను ఉద్ధరించేశామని చెబుతున్నారు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా వుండి విశాఖకు చేసిన ఒక్క గొప్ప మంచి పని ఏంటో చంద్రబాబు చెప్పగలిగితే బావుంటుంది.
విశాఖలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేశారా.? విశాఖలో కొత్తగా జాతీయ సంస్థలేవైనా నెలకొల్పబడ్డాయా.? ఇలా ఏ ప్రశ్నకీ చంద్రబాబు వద్ద సమాధానం వుండదుగాక వుండదు. బోగాపురం అంతర్జతీయ విమానాశ్రయం గురించి చంద్రబాబు చెప్పుకోవచ్చుగాక.. అదింకా కార్యరూపం దాల్చలేదు. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమ విస్తరణ అన్నారు.. దాని పరిస్థితీ అంతంతమాత్రమే. అయినా, విశాఖ ఓట్లు చంద్రబాబుకి కావాలి. ఆయనంతే.. మారడంతే.!
350624 801003Howdy! I just want to give an enormous thumbs up for the excellent data you may have here on this post. I will likely be coming back to your weblog for more soon. 946778