కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోయిందని, బీజేపీ చెప్పినట్టే ఆ సంస్థ పనిచేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికైనా ఈసీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్ తో ఆదివారం ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. చంద్రబాబుతోపాటు కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కారణం వల్లే అగ్రదేశాలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మనదేశం ఎన్నికలు ప్రారంభమైపోయాయని, బ్యాలెట్ పద్ధతిలో ఇప్పుడు వాటిని నిర్వహించే అవకాశం లేనందున 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని వెల్లడించారు.
ఏపీలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని, తాను దేశం కోసమే ఈ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశం కోసమే నేను పోరాడతున్నాను. ఈవీఎంలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ కారణంతోనే జర్మనీ వంటి దేశాలు సైతం బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపుతున్నాయి. ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉండటంతోనే ఆ దేశాలు వాటికి స్వస్తి చెప్పి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. మన దేశంలో ఈవీఎంల ఆడిట్ కు అవకాశం లేదు. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేసి, 25 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారు. అక్కడ పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయో అర్థం కావడంలేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీలో ఈనెల 11న పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఈసీ నిర్వాకం వల్ల మరుసటి రోజు ఉదయం 4 గంటలకు చివరి ఓటు పడిందని, ఇదేం తీరని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్పులు ఏడు సెకన్లపాటు కనిపిస్తాయని చెప్పారని, కానీ చాలాచోట్ల మూడు సెకన్లు మాత్రమే కనిపించాయని చెప్పారు. ఇది ఎలా మారిందని అడిగితే ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. ప్రస్తుతం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కుదరదు కాబట్టి, 50 శాతం వీవీప్యాట్ స్లిప్పలు లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఆరు రోజుల సమయం పడుతుందని ఈసీ చెప్పడం పూర్తిగా అవాస్తమని ఆయన స్పష్టంచేశారు. కాగా, యంత్రాలపై తమకు నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ పైనే తమకు విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టంచేశారు. ఈవీఎంలను ఎలా దుర్వినియోగం చేయొచ్చో తమా చేసి చూపిస్తామని సవాల్ చేశారు. కాంగ్రెస్ కు చెందిన మరో సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ఎలాంటి పరిశీలనా లేకుండా లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
33097 328397I wish I had a dime for every bad post Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 603407
680126 114690Thank you, Ive just been searching for information about this subject for a even though and yours may be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you certain concerning the supply? 987894