Switch to English

దేశం కోసమే నా పోరాటం: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోయిందని, బీజేపీ చెప్పినట్టే ఆ సంస్థ పనిచేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికైనా ఈసీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్ తో ఆదివారం ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. చంద్రబాబుతోపాటు కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కారణం వల్లే అగ్రదేశాలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మనదేశం ఎన్నికలు ప్రారంభమైపోయాయని, బ్యాలెట్‌ పద్ధతిలో ఇప్పుడు వాటిని నిర్వహించే అవకాశం లేనందున 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని వెల్లడించారు.

ఏపీలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని, తాను దేశం కోసమే ఈ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశం కోసమే నేను పోరాడతున్నాను. ఈవీఎంలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ కారణంతోనే జర్మనీ వంటి దేశాలు సైతం బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపుతున్నాయి. ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉండటంతోనే ఆ దేశాలు వాటికి స్వస్తి చెప్పి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. మన దేశంలో ఈవీఎంల ఆడిట్ కు అవకాశం లేదు. తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేసి, 25 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారు. అక్కడ పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయో అర్థం కావడంలేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఏపీలో ఈనెల 11న పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఈసీ నిర్వాకం వల్ల మరుసటి రోజు ఉదయం 4 గంటలకు చివరి ఓటు పడిందని, ఇదేం తీరని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్పులు ఏడు సెకన్లపాటు కనిపిస్తాయని చెప్పారని, కానీ చాలాచోట్ల మూడు సెకన్లు మాత్రమే కనిపించాయని చెప్పారు. ఇది ఎలా మారిందని అడిగితే ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. ప్రస్తుతం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కుదరదు కాబట్టి, 50 శాతం వీవీప్యాట్ స్లిప్పలు లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్లి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఆరు రోజుల సమయం పడుతుందని ఈసీ చెప్పడం పూర్తిగా అవాస్తమని ఆయన స్పష్టంచేశారు. కాగా, యంత్రాలపై తమకు నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ పైనే తమకు విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టంచేశారు. ఈవీఎంలను ఎలా దుర్వినియోగం చేయొచ్చో తమా చేసి చూపిస్తామని సవాల్ చేశారు. కాంగ్రెస్ కు చెందిన మరో సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ఎలాంటి పరిశీలనా లేకుండా లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...