BRS: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS party) ఆవిర్భావ వేడుకలు తెలంగాణ (Telangana) భవన్ లో ఘనంగా జరిగాయి. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన పార్టీ నేడు బీఆర్ఎస్ గా మారి 22ఏళ్లు పూర్తి చేసుకుని 23వ ఏట అడుగుపెట్టింది. ఈనేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cm KCR) తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్థిత్వాన్ని పునఃప్రతిష్టించిన వ్యక్తి కేసీఆర్ అని.. రాష్ట్రాన్ని సాధించి తక్కువ కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. మంత్రి హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. 22ఏళ్ల క్రితం అధినేత కేసీఆర్ సారధ్యంలో తెరాసగా ఆవిర్భవించిన పార్టీ నేడు బీఆర్ఎస్ గా మారి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీగా ఎదిగిందన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ప్రారంభమైన రాష్ట్ర ప్రతినిధుల సమావేశం
BRS Party state delegates meeting has been started in Telangana Bhavan presided over by BRS President, CM Sri KCR. pic.twitter.com/0v9PndNrqG
— BRS Party (@BRSparty) April 27, 2023