ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి గారు ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె వైజాగ్ లో గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు. గత రెండు మూడు రోజులుగా ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నేడు తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ఈశ్వరమ్మకు ఏడుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు. బొత్స సత్యనారాయణ పెద్ద కొడుకు. ఈమె మరో తనయుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెల్సిందే. నేడు మద్యహ్నం సమయంలో ఈశ్వరమ్మకు విజయనగరంలోని స్వర్గ దామంలో అంత్య క్రియలు నిర్వహించబోతున్నారు. బొత్సను పలువురు ప్రముఖులు పరామర్శించారు. సీఎం జగన్ ఫోన్ ద్వారా మంత్రి బొత్సకు సానుభూతి తెలియజేసి ఈశ్వరమ్యకు శ్రద్దాంజలి ఘటించారు.
607469 795863Man you legend. return see my internet site, you must get pleasure from it. 382722