ప్రకాశం జిల్లా అద్దంకిలోని కురిచేడులో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కన చర్చి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
బీజేపీ నాయకురాలు సాధినేని యామిని ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వాహనం దిగి బీజేపీ కార్యకర్తలతో సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్లారు.
భవాని కూడలి వద్దకు వచ్చిన తర్వాత యామిని రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుకు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అద్దంకిలోని ఆర్ బీఐ బంగ్లాకు తరలించారు. దీంతో ఆమె పోలీసుల నుంచి తప్పించుకుని బంగ్లా గేటు ఎక్కి బయటికెళ్లడానికి ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని మళ్లీ బంగ్లాకు తరలించారు. మరోవైపు.. రామతీర్థం కొండపైకి వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జరిగిన వాగ్వాదంలో సోమువీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఎమ్మెల్సీ మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
651072 29395I respect your piece of work, appreciate it for all the fascinating content material . 6186
531711 478719Hi there! Nice post! Please do inform us when we could see a follow up! 533409