Switch to English

యేసుబాబు.. ఏపీలో మొదలైన ‘బీజేపీ’ మార్కు ఆట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో తనదైన ‘దిక్కుమాలిన రాజకీయాన్ని’ మొదలు పెట్టింది. దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల నేపథ్యంలో ‘మతం కార్డు’ని ఎంత దారుణంగా ‘కమలదళం’ తెరపైకి తెచ్చిందో చూశాం. ఆ స్థాయిలో, వీలైతే అంతకు మించిన స్థాయిలో ఆంధ్రపదేశ్‌లో కూడా మత రాజకీయాన్ని తెరపైకి తెచ్చేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది.

‘చందా బాబు.. యేసు బాబు..’ అంటూ బీజేపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వచ్చిన ప్రస్తావన ఇప్పుడు ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడి విషయంలో అయినా, ఏ ముఖ్యమంత్రి విషయంలో అయినా ఇలాంటి దారుణమైన మత రాజకీయం చూశామా.? అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

‘ఏం, నరేంద్ర మోడీ మీద మతం ముద్ర వేసినప్పుడు.. వైఎస్ జగన్ మీదనో మరో నేత మీదనో మతం ముద్ర వేస్తే తప్పేంటి.?’ అన్న వాదన కొత్తగా, ఒకింత ఆసక్తికరంగా తెరపైకొస్తోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఆంధ్రపదేశ్‌లో హిందూ మతంపై ఓ పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది. ఈ దాడి వెనుక ఎవరున్నారు.? అన్నది వేరే చర్చ. బలవంతపు మత మార్పిడులు విచ్చలవిడిగా ఆంధ్రపదేశ్‌లో జరుగుతున్నాయి.

‘నేను క్రిస్టియన్‌ని..’ అంటూనే, కేవలం దళితులకు మాత్రమే దక్కాల్సిన రిజర్వేషన్లను కొందరు పొందుతున్నారు.. కీలకమైన పదవుల్లో వున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో బీజేపీ ‘మతం’ కార్డు అందుకోవడాన్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. గత కొంతకాలంగా ఏపీలో ‘హిందుత్వ’ నినాదాన్ని గట్టిగా వినిపిస్తోంది బీజేపీ. అయితే, ముఖ్యమంత్రిని పట్టుకుని ‘యేసుబాబు’ అని బీజేపీ అనడాన్ని మాత్రం స్వాగతించలేం.

ముఖ్యమంత్రి ఏ మతానికి చెందినవాడన్నదానిపై ఇటీవల హైకోర్టులో ఓ పిర్యాదు విచారణకు వస్తే, ‘క్రిస్టియన్ అనడానికి ఆధారాలున్నాయా.?’ అన్న ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోయింది. తన చుట్టూ వస్తున్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వీలు చిక్కినప్పుడల్లా హిందూ ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. కాదు కాదు, విరివిగా పాల్గొంటున్నారు. అయితే, ఆయన అండ చూసుకుని కొందరు కింది స్థాయిలో బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారనీ.. ఈ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్లు వుంటోందన్న విమర్శలైతే లేకపోలేదు.

మొత్తమ్మీద, తిరుపతి ఉప ఎన్నికల వేల ‘హిందుత్వ’ ఎజెండాని అందుకున్న బీజేపీ, ‘యేసుబాబు’ విమర్శలతో అనుకున్నది సాధిస్తుందా.? వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...