కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో రైతన్న పిలుపునిచ్చిన భారత్ బంద్ కు విశేషంగా మద్దతు వెల్లువెత్తుతోంది. పలు రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించడంతో మంగళవారం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శాంతియుతంగా బంద్ జరపాలంటూ రైతన్నలు ఇచ్చిన పిలుపునకు స్పందన భారీగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం బంద్ ప్రభావం లేకుండా చూసుకునే చర్యలు చేపట్టారు.
మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరుకుంది. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఘటనలూ చోటుచేసుకోకుండా చూసుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగుతోంది. తెలంగాణలో అధికార పార్టీ ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటుండగా.. ఏపీ ప్రభుత్వం రైతుకు సంఘీభావం ప్రకటించింది. దీంతో అటు రైళ్లు, ఇటు బస్సులు కూడా కదల్లేదు.
218863 501978my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the top stuff 200869