డైమండ్ రాణి.. ఈ సెటైర్ తొలిసారిగా వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నేత, సినీ నటి, మంత్రి కూడా అయిన నగిరి ఎమ్మెల్యే రోజా మీద రాజకీయ విమర్శలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాస్ చేసిన కామెంట్ అది. తన మీద పదే పదే రోజా చేస్తున్న విమర్వలపై పవన్ కళ్యాణ్ అలా స్పందించాల్సి వచ్చింది.
ఇక, డైమండ్ రాణి.. అంటూ తాజాగా మండిపడ్డారు సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. ఒకప్పుడు బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ భక్తుడు. కానీ, ఇప్పుడాయన లెక్క వేరు. పవన్ కళ్యాణ్కి కాస్త దూరంగా వుంటున్నాడాయన. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు కూడా. రేవంత్ రెడ్డి మీద రోజా, ‘యాక్సిడెంటల్ సీఎం’ అంటూ చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ గుస్సా అయ్యాడు.
ఏపీ మంత్రి రోజా మీద, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్, ‘పులుసు పాప’ అంటూ కామెంట్ చేయడం వైరల్ అవుతోంది. గతంలో కూడా ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో లైవ్లో బండ్ల గణేష్, ఫోన్ లైవ్లో రోజా.. చాలా చాలా దారుణంగా తిట్టుకున్నారు.
అప్పట్లో పవన్ కళ్యాణ్కి పక్కలేసి, అమ్మాయిల్ని సప్లయ్ చేశావ్.. అని బండ్ల గణేష్ని రోజా విమర్శించడంతో, ‘నీక్కూడా వేశాను.. నిన్ను కూడా పంపాను..’ అంటూ కౌంటర్ ఎటాక్ చేశాడు. ఈ క్రమంలో, ‘ఒరేయ్.. ఒసేయ్..’ అని కూడా తిట్టుకున్నారు బండ్ల గణేష్, రోజా.
ఆ తర్వాత ఓ సందర్భంలో, రోజా మీద తనకెలాంటి వ్యక్తిగత వైరమూ లేదంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, పులుసు పాప అంటే ఏంటి.? పాత సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ఒకరు ‘పులుసు’ పాత్రలో కనిపించడం అప్పట్లో పెను సంచలనం.