Switch to English

ఏపీ ప్రభుత్వం, ఇండస్ట్రీపై మరోసారి బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘నన్ను పిలవలేదు’, ‘ఏంటి భూములు పంచుకుంటున్నారా?’ అన్న రెండు మాటలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్ని ప్రకంపనలు సృష్టించాయి గత కొద్దీ రోజులుగా చూస్తున్నాం. ఇప్పటికో ఏదో ఒక ఛానల్ లో ఈ విషయంపై డిస్కషన్ జరుగుతూనే ఉంది. జూన్ 6న సి కళ్యాణ్ ఈ సారి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలని బాలకృష్ణని జూన్ 9న ఏపీ సీఎం వైఎస్ జగన్ తో జరగబోయే మీటింగ్ కి పిలిచామని, కానీ ఆయన బర్త్ డే వేడుకల్లో భాగంగా రావట్లేదని అన్నారు. దీంతో అన్నీ సెట్ అయినట్టు అనిపించింది.

కానీ తాజాగా బాలకృష్ణ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూన్ 9న ఏపీ సీఎం జగన్ తో జరిగే మీటింగ్ కి పిలుపు వచ్చిందా అంటే.. ‘ లేదండి. నాకు తెలిసింది, అది ఎవరి ద్వారానో, కానీ మెయిన్ సోర్స్ నుంచి నాకు పిలుపు రాలేదని’ చెప్పి మరోసారి ఆయన వ్యాఖ్యలతో దుమారం లేపారు.

అందరితో స్నేహభావంగా ఉండే మీకు ఇండస్ట్రీతో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడగగా, బాలకృష్ణ సమాధానం ఇస్తూ.. ‘ఇండస్ట్రీ కోసమే.. మొదటగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెండవది సినిమా ఇండస్ట్రీ బాగుకోసమైతే 100% నన్ను పిలవకపోయినా ఎప్పుడూ ముందుటాను. ఈ కరోనా ఇంకా ఎంత కాలం ఉన్నా నా వంతుగా ఇండస్ట్రీని నేను ఆదుకుంటాను. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో ఆదుకున్నా, ఇప్పుడూ నా పరంగా ఆదుకుంటానని’ అన్నారు..

ఒక్క మాటతో(భూములు పంచుకుంటున్నారా? అనే మాట) సెన్సేషన్ క్రియేట్ చేశారు.. ఆ విషయం సర్దుమణిగిందా అంటే, ‘ లేదండి, ఇంకా సర్దుమణిగినట్టు కన్పించడం లేదు. ఒక మాట చెప్తా.. ప్రస్తుతం కరోనా వల్ల ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది.. ముందుగా పరిష్కరించాల్సింది.. షూటింగ్స్ ఎలా చేయాలి? థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ కావాలి? కార్మికులకు ఎలా మళ్ళీ జీవనం కలిగించాలి అన్నవి ప్రధానం కానీ ఇవి వదిలేసి.. ఇప్పుడు ఏపీకి వెళ్లి సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మీటింగులేంటో నాకు అర్థంకావట్లేదు. ఇప్పుడు స్టూడియోస్ కట్టాలన్నా పనోళ్ళు రాలేని పరిస్థితి. ఇండస్ట్రీ బాగు కోసం కాకుండా వాళ్ళ ‘సెల్ఫ్ సెంటర్డ్’ అనీ వారి స్వలాభాల కోసం చేస్తున్నారంతే’ అని బాలయ్య అన్నారు.

మరి సమస్య వచ్చినప్పుడు రియల్ ఇండస్ట్రీ గురించి కష్టపడేదెవరు అని అడిగితే ‘ ఇలా చూసుకుంటే ఎవరూ కష్టపడట్లేదు. ఉదాహరణకి జరిగిన విషయం మీద తలసాని యాదవ్ గారు నాతో మాట్లాడతా అన్నారు. కాల్ రాలేదు. విజయవాడ పిలుపుకి ఎవరో కాల్ చేస్తారు అన్నారు.. అదీ రాలేదు.. ఎలా భరితెగించారంటే యధా రాజా తద ప్రజా అన్నట్టు.. ప్రజల్ని అంత చులకనగా చూస్తున్నారు. అదే నా భాధ.. అటు రాజకీయం అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఒక విప్లవం రావాలి.. విప్లవం అంటే ఈ సో కాల్డ్ పెద్దలు కాదండి, 24 క్రాఫ్ట్స్ లోని అందరి నుంచీ విప్లవం రావాలి. అలాగే, సమాజం నుంచి ప్రభుత్వంపై విప్లవం రావాలి.. అప్పుడే రాష్టం, చలనచిత్ర పరిశ్రమ రెండూ బాగుంటాయి. రాజకీయ పార్టీ పరంగా ఇదంతా జరగట్లేదు, కావాలనే చేస్తున్నారని’ బాలకృష్ణ అన్నారు.

ఇక ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై మీ కామెంట్ అని అడిగితే ‘ఈ కరోనా టైంలో అన్నిటిమీద స్పందించలేను కానీ అన్న కాంటీన్ లాంటివి ఉండి ఉంటే ఈ సమయంలో చాలా హెల్ప్ అయ్యేవి. అలాగే అన్నీ ఓకే అనుకొని వారూ అసెంబ్లీకి అటెండ్ అయ్యారు, డిస్కషన్స్ అయ్యాక ఇప్పుడు రాజధాని మార్చడమే విడ్డూరంగా, చాలా హాస్యాస్పదంగా ఉందని’ అన్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...