నందమూరి బాలకృష్ణ వరస ప్లాపుల తర్వాత చేస్తోన్న చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలోని యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తైన వెంటనే బాలయ్య మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తో పనిచేస్తున్నట్లు దాదాపు ఖరారైంది. అలాగే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఇవన్నీ కాకుండా బాలకృష్ణతో మరో దర్శకుడు పనిచేయడం ఖాయమని తేలింది.
ప్రస్తుతం రవితేజతో క్రాక్ ను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తాడట. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. మైత్రి మూవీస్ ప్రస్తుతం చాలా దూకుడుతో ఉంది.
వరసగా టాప్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది. మహేష్ తో సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలు మైత్రి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య సినిమాను కూడా లైన్లో పెట్టింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
475698 591058I discovered your weblog internet website on bing and appearance several of your early posts. Preserve up the extremely good operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far much more on your part down the road! 217141