ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ స్వయంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థికంగా చాలా ఇబ్బంది గా ఉంది. అందుకే ఉద్యోగుల జీతాలను కూడా సమయానికి ఇవ్వడానికి వీలు పడటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తున్నప్పటికి ఆర్థికంగా ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నాడు.
ఈ పరిస్థితికి పూర్తిగా గత ప్రభుత్వం కారణం అన్నాడు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీరు వల్లే ఈ పరిస్థితి అని.. పైగా కరోనా వల్ల ఏపీ ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో పడ్డట్లు అవుతుందని ఆయన పేర్కొన్నాడు. గత ప్రభుత్వం అప్పులు చేసి మా నెత్తిన పెట్టి పోయింది. ఆర్థికంగా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా సంక్షేమ పథకాలు మాత్రం ఆపేయడం లేదని పేర్కొన్నాడు. ఇక ఏపీ నుండి అమరరాజా ఫ్యాక్టరీ తరలి వెళ్లడంపై స్పందిస్తూ తాము ఆ సంస్థను వెళ్లి పోమని చెప్పలేదని పేర్కొన్నాడు. కాలుష్యం వెదజల్లే అలాంటి కంపెనీలు అక్కర్లేదని కూడా సజ్జల అన్నాడు.
118257 682063hi!,I like your writing so a lot! share we communicate far more about your post on AOL? I need to have a specialist on this region to solve my issue. Might be thats you! Looking forward to see you. 623409