ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో వారి సేవలకు సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం చప్పట్లు కొట్టి అభినందించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాలంటీర్ల వల్ల గ్రామ స్వరాజ్యం వచ్చిందని ప్రశంసించారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వాలంటీర్లకు చప్పట్లు కొట్టాలా లేక చెట్టుకు కట్టేసి కొట్టాలా అంటూ దుయ్యబట్టింది.
‘బాలికపై అత్యాచారానికి పాల్పడిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా? వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చేయాలా? నాటుసారా కాచిన వాలంటీర్ ని మెచ్చుకోవాలా? అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చేయాలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్ గారూ’ అంటూ టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ట్వీట్ చేశారు. పెన్షన్ల పంపిణీ తప్ప ఈ వ్యవస్థ ఏం చేస్తుందో చెప్పాలని మరో నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం అధికార పార్టీ నేతలు చప్పట్లు కొడుతూ వాలంటీర్లను అభినందించగా.. మరోవైపు విజయవాడులో తెలుగు యువత కార్యకర్తలు వాలంటీర్లను ప్లకార్డులను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు.
ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు నేరుగా అందించే లక్ష్యంతో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. అయితే, వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని.. పార్టీ పని కోసం ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని విపక్షాలు విమర్శించాయి. వ్యవస్థ ఉద్దేశం మంచిదే అయినా.. రాజకీయపరమైన ప్రయోజనాలకే వారిని వైసీపీ వినియోగించుకుంటోందనే ఆరోపణలున్నాయి.
751623 207816youve gotten an crucial weblog right here! would you wish to make some invite posts on my weblog? 808659
245340 757896Should you happen to significant fortunate folks forms, referring by natural indicates, moreover you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this topic. awnings 263360