ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి 24 మంది మంత్రులు రాజీనామా లేఖలు అందజేశారు. మంత్రుల రాజీనామాలను ఈరోజు రాత్రికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు రాజీనామా లేఖలు అందజేశారు. 25 మంది మంత్రుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో మిగిలిన వారు రాజీనామా చేశారు.
సామాజికవర్గాల ప్రకారం ప్రస్తుత మంత్రివర్గంలోని వారు కొందరు తిరిగి మంత్రులుగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రులందరికీ ఇదే చివరి మంత్రివర్గ సమావేశం. గవర్నర్ వారి రాజీనామాలు ఆమోదించే వరకూ వీరు మంత్రులుగానే కొనసాగనున్నారు. కొత్త మంత్రులుగా ఎవరు ఎంపికవుతారనేది ఈనెల 10న ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈనెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. సచివాలయంలోని రెండో బ్లాక్ ఎదుట ప్రమాణస్వీకార వేదికను నిర్మించాలని నిర్ణయించినట్టు సమాచారం.
645016 453006Hello. Neat post. There is an issue along with your site in firefox, and you may want to test this The browser may be the market chief and a big part of other individuals will miss your fantastic writing because of this difficulty. 606518