జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి. ఈ కారణంగా జులై 1న అందాల్సిన పెన్షన్లను జులై 8వ తేదీకి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదెక్కడి విడ్డూరం.? అంటే, పెంచుతున్న పెన్షన్లను ఓ మంచి రోజున లబ్దిదారులకు అందజేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ చిన్నపాటి జాప్యమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చాలా కష్టంగా తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకోవాల్సి వస్తోంది.
చంద్రబాబు హయాంలో ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్లు లబ్దిదారులకు అందేవి. మొదటి వారమేంటి.? ఐదో తేదీ లోపలే పెన్షన్ల పంపకం దాదాపుగా పూర్తయిపోయేది. అలాంటిది, ఆ పెన్షన్ల గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే లబ్ది దారులకు 8వ తేదీ వరకూ పరీక్ష పెడుతోంది వైఎస్ జగన్ సర్కార్.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కారణంగా ఇంకో గొప్ప పథకాన్ని ఏదైనా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించి వుంటే దాన్నెవరూ ప్రశ్నించేవారు కాదు. పెరిగిన 250 రూపాయల పెన్షన్తో కలిపి మొత్తం పెన్షన్ 2250 కోసం లబ్దిదారులు జులై 8వ తేదీ వరకు ఎదురుచూడాల్సి రావడం బాధాకరమే.
నిజానికి జూన్ 1 నుంచే పెంచిన పెన్షన్ అందుబాటులోకి వస్తుందని లబ్దిదారులు భావించారు. ఒక నెల ఆలస్యంగా ఆ పెంచిన పెన్షన్ చేతికి అందుతుందనుకుంటే, ఇంకో ఎనిమిది రోజులు ఎదురు చూడాల్సి రావడం బాధగా వుందని లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు.
నెలరోజుల్లోనే అద్భుతాలు సృష్టించేశామని చెప్పుకోవడంతోనే సరిపోతుందా.? సమయానికి పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ముందు ముందు నవరత్నాల్ని ఎలా అమలు చేస్తుంది.? అన్న విమర్శ అప్పుడే విపక్షాల నుంచి పుట్టుకొస్తోంది. మరోపక్క, 8 రోజుల ఆలస్యం అనేది పెద్ద విషయం కాదనీ, విపక్షాలు అనవసర రాద్ధాం చేస్తున్నాయని అధికార పార్టీ ఎదురుదాడి షరామామూలుగానే మొదలు పెట్టేసింది.
337057 2614Spot on with this write-up, I truly assume this web site wants much more consideration. probably be again to read considerably far more, thanks for that information. 355237
437963 942004Hi there, just became aware of your weblog through Google, and found that its actually informative. Im gonna watch out for brussels. I will appreciate in the event you continue this in future. Lots of folks will be benefited from your writing. Cheers! 44473