ముంబైలో 2008లో నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ అంత తేలిగ్గా మరిచిపోలేదు. 26/11 అటాక్స్ గా ఆ ఉగ్రదాడిలో 10 మంది ఉగ్రవాదులు పొల్గొని దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడి జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలో మళ్లీ అలజడి సృష్టించేందుకు ఉగ్ర మూకలు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సమావేశం కావడం చర్చనీయాంశమైంది.
గురువారం జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో బన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఈ అంశం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీరి సమావేశం జరిగినా ప్రధానంగా ఈ అంశాలపైనే చర్చించినట్టు తెలుస్తోంది. 26/11 అటాక్ జరిగి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత్ లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు కుట్రలు పన్నారని తెలుస్తోంది.
నగ్రోటా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు ఉగ్రవాదులు కూడా నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారేనని తెలుస్తోంది. వీరంతా ఇటివల భారత లోకి అక్రమంగా చొరబడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 28 నుంచి డిసెంబరు 19 వరకు 8 దశల్లో జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని భగ్నం చేసేందుకు కూడా ఉగ్రవాదులు కుట్రలు పన్నినట్టు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 12 ఏళ్ల క్రితం ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 166 మంది మృతి చెందగా 300 మంది గాయపడ్డారు.
127273 203910An attention-grabbing dialogue is value comment. Im sure that its far better to write on this topic, towards the often be a taboo topic but typically persons are not sufficient to speak on such topics. To an additional location. Cheers 23454
673556 317884Hey There. I discovered your weblog using msn. That is a quite smartly written article. I will make certain to bookmark it and come back to read more of your beneficial details. Thanks for the post. I will undoubtedly return. 970614