Switch to English

పొన్నూరు అసెంబ్లీ.! అంబటి మురళీకృష్ణకే వైసీపీ టిక్కెట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో జాబితా బయటకు వచ్చింది 2024 ఎన్నికలకు సంబంధించి. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు, ప్రమోషన్ లభించింది. ఆయన వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు కిలారు వెంకట రోశయ్యను గుంటూరు లోక్ సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా వుంటే, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అవకాశం దక్కించుకున్నారు అంబటి మురళీ కృష్ణ. గడచిన ఏడాది కాలంగా అంబటి మురళీ కృష్ణ, జగన్నామ సంక్షేమ సంగమం పేరుతో పొన్నూరు నియోజకవర్గం పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

వృద్ధులు, మహిళలు, యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కళ్ళ జోళ్ళ పంపిణీ, హృద్రోగ పరీక్షలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. యాంజియోగ్రామ్ చేయించడం, స్టంట్లు వేయించడం, గుండె సంబంధిత ఇతర శస్త్ర చికిత్సలు చేయడం వంటి సేవా కార్యక్రమాలతో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకన్నారు అంబటి మురళీ కృష్ణ.

సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అంబటి మురళీ కృష్ణ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఏడాది కాలంలోనే సుమారుగా 61 వైద్య శిబిరాలు నిర్వహించారు. మొత్తంగా 105 వరకు సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. దివ్యాంగ దర్శిని పేరుతో కాళ్ళు చేతులు కోల్పోయిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల్ని అందిస్తూ వచ్చారు.

వీటితోపాటుగా, ఇంటింటికీ వెళ్ళి, వైసీపీ చేపడుతూ వస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించడం ద్వారా వైసీపీ శ్రేణుల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నారు.

పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంబటి మురళీకృష్ణకు ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న దరిమిలా, ఆయన్నే పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

గుంటూరులో కాపు హాస్టల్ నిర్మాణంలోనూ భాగం పంచుకున్న అంబటి మురళీకృష్ణకి, కాపు సామాజిక వర్గంలోనూ మంచి గుర్తింపు లభించింది.

సీఎం జగన్ మోహన్ రెడ్డితో తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాననీ, తనకు పార్టీ అధినాయకత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందాయనీ, ఇప్పుడు తనకు పొన్నూరు అసెంబ్లీ సమన్వయకర్తగా అవకాశం లభించడం తనకు ఆనందంగా వుందనీ అంబటి మురళీకృష్ణ చెప్పుకొచ్చారు.

నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తానని చెప్పారు అంబటి మురళీ కృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...