బిర్యానీ కోసం.. రెండొందల రూపాయల కూలీ కోసం ధర్నాలు చేస్తున్నారా.? అంటూ ఓ మహిళా రిపోర్టర్, రాజధాని ప్రాంత రైతుల్ని, మరీ ముఖ్యంగా మహిళా రైతుల్ని ప్రశ్నించిందట. దాంతో, మహిళా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ‘మేం రాజధాని కోసం భూముల్ని ఇచ్చాం.. మా జీవితాల్ని పణంగా పెట్టాం.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాం.. మేం రైతులం.. మీలా మేం బిర్యానీల కోసం కక్కుర్తి పడటంలేదు.. మీ ఛానల్ యాజమాన్యానికి మీరు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారేమో.. మీ ఛానల్ అధికార పార్టీకి అమ్ముడుపోయిందేమో.. మేం ఎవరికీ అమ్ముడు పోలేదు. మేం రైతులం, మాకు ఆత్మగౌరవం వుంది..’ అంటూ రాజధాని ప్రాంత మహిళా రైతులు, ఓ ఛానల్కి చెందిన మహిళా రిపోర్టర్ పేరు చెప్పి మరీ కడిగి పారేశారు.
ఇంతకీ ఎవరా మహిళా రిపోర్టర్.? ఏమా కథ.? అంటే, రాజధాని అమరావతి విషయమై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అయితే, సమాజానికి నీతులు చెప్పే ఓ న్యూస్ ఛానల్, ఇటీవల యాజమాన్యం మార్పు తర్వాత, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘కరపత్రిక’గా మారిపోయింది. ఆ ఛానల్కి చెందిన మహిళా రిపోర్టర్ ప్రదర్శించిన అత్యుత్సాహమే ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. మరోపక్క, సదరు మహిళా జర్నలిస్టుపై కొందరు దుశ్చర్యకు పాల్పడ్డారంటూ అధికార పార్టీకి చెందిన మీడియా కథనాల్ని వండి వడ్డిస్తుండడం గమనార్హం.
రాజధానిలో గత పది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా దాన్ని కనీసం తమ పత్రిక, ఛానల్లో ప్రస్తావించని సదరు మీడియా సంస్థ, ఇన్నాళ్ళూ ద్వేషించిన ఛానెల్కి చెందిన రిపోర్టర్ విషయంలో అత్యుత్సాహం చూపుతూ, అమరావతిలో ఆందోళనల వెనుక అసాంఘీక శక్తులు చొరబడ్డాయనడానికి ఇదే నిదర్శనమంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపడం కొసమెరుపు.
69465 392538quite nice post, i surely enjoy this fabulous web site, persist with it 410449