Adah Sharma: వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఆదాశర్మ( Aadha sharma). ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ముంబైలోని ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్తుండగా ఆదాశర్మ వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కారు లో ఆమెతోపాటు ఆ చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ కూడా ఉన్నారు. ఈరోజు కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తా యాత్ర లో వీళ్లు పాల్గొనాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు తమకు ఆరోగ్యం సరిగా లేనందువల్ల హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనలేకపోతున్నామంటూ సుదీప్తో ట్వీట్ చేశారు. యాక్సిడెంట్ వివరాలు ఏవి వెల్లడించలేదు.
ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కొందరు సినీ ప్రముఖులు బహిరంగంగానే ఈ చిత్రంపై విమర్శలు చేస్తున్న కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదాశర్మ ఈ సినిమాలో శాలిని ఉన్ని కృష్ణన్ అనే యువతి పాత్రలో నటించింది.
నేను బాగానే ఉన్నా : ఆదా శర్మ
కారు ప్రమాద ఘటనపై ఆదాశర్మ స్పందించింది. ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.’ నేను బాగానే ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు ఎన్నో మెసేజ్ లు వస్తున్నాయి. మా టీం అందరం బాగానే ఉన్నాం. అంత సీరియస్ ఏం లేదు. మీరు చూపించిన ప్రేమకు అందరికీ ధన్యవాదాలు’ అని ట్విట్ చేసింది.