Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’ (Viswambhara). ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న సినిమా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా త్రిష (Trisha) నటిస్తూండగా కీలకపాత్రల్లో హీరోయిన్లు సురభి, ఇషా చావ్లా ఎంపికయ్యారు. వీరిలో సురభి సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..
‘విశ్వంభర కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. ఇంత మంచి ప్రాజెక్టులో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నాది చాలా కీలకమైన పాత్ర. ముఖ్యమైన ఘట్టంలో నా పాత్ర ఉంటుంది. సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా. చిరంజీవిగారితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’నని పేర్కొంది.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో సురభి కూడా పాల్గొంటోందని.. కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు.. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మెగాస్టార్. త్వరలోనే నల్గొండ పరిధిలో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కాబోతోంది.