మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సినిమాపై పెట్టుకున్న అంచనాలను మాత్రం ఆ సినిమా రీచ్ కాలేక పోయింది. చిరంజీవి చాలా కష్టపడి ఆ సినిమాను చేశాడు. సినిమా నిర్మాణం పరంగా కూడా భారీగా ఖర్చు చేశారు. అయినా కూడా నిరాశే మిగలడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కొరటాల శివతో చాలా పట్టుదలతో ఈ సినిమాను రామ్ చరణ్ మరియు చిరంజీవిలు చేస్తున్నారు.
ఆచార్య అంటూ ఇటీవలే ఈ సినిమా టైటిల్ను రివీల్ చేసిన విషయం తెల్సిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుతున్నారు. త్వరలోనే ఫస్ట్లుక్ వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఉగాదికి సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వబోతున్నారట. మొదటి నుండి అనుకుంటున్నట్లుగానే ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆగస్టు 14వ తారీకున ఆచార్య సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంట. మెగా వర్గాల్లో ఈ విషయం చర్చ జరుగుతోంది. దసరాకు ఇతర సినిమాలు ఉన్న కారణంగా పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఆగస్టులోనే సినిమాకు ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. మెగాస్టార్ ఈ విషయాన్ని కూడా ఏదో ఒక వేదికపై వెళ్లడిస్తాడో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో విప్లవ భావాలున్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదే సమయంలో ఈ చిత్రంలో మహేష్బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆచార్యలో మహేష్బాబు వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
308983 341120I like the valuable info you give in your articles. Ill bookmark your weblog and check once more here regularly. Im quite certain Ill learn a lot of new stuff proper here! Good luck for the next! 556020
663404 646445I like this site its a master peace ! Glad I identified this on google . 466596