Switch to English

అరేబియాలో రేవ్ పార్టీ..! ఎన్ సీబీ అదుపులో షారుఖ్ ఖాన్ కుమారుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అరేబియా సముద్రంలో డ్రగ్స్‌తో రేవ్ పార్టీ జరుపుకుంటున్న క్రూయిజ్ షిప్ ను ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉండటం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం రాత్రి ఓ క్రూయిజ్ షిప్‌ను డ్రగ్స్ తోసహా కనుగొన్నారు. ఆర్యన్ ఖాన్‌ తో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ పార్టీని ఢిల్లీకి చెందిన నమస్క్రే ఎక్స్ పీరియన్స్, ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ ఖషీఫ్ ఖాన్ పర్యవేక్షణలో జరిగినట్టు సమాచారం. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకూ ఈ రేవ్ పార్టీ జరగాల్సి ఉంది. 100 టికెట్లను మాత్రమే విక్రయించి.. మిగిలిన టికెట్లను నిర్వాహకులే నేరుగా విక్రయించారు.

దీనికి విపరీతమైన పోటీ నెలకొనడంతో భారీగా టికెట్లు అమ్ముడయ్యాయి. 82వేలు పెట్టి టికెట్ కొన్న ఓ యువతిని షిప్ నిండిపోయిందని ఎక్కించుకోలేదంటే ఈ పార్టీకి ఉన్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ సమాచారం అందుకున్న ఎన్ సీబీ అధికారులు సాధారణ ప్యాసింజర్లు మాదిరిగానే షిప్ లోకి ప్రవేశించారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీలో భాగంగా డ్రగ్స్ బయటకు తీసినట్టు తెలుస్తోంది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో కొకెయిన్, మెఫెడ్రోన్, ఎక్స్‌స్టాసీ సహా పలురకాల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. ఆర్యన్ ఖాన్ సహా మున్‌మున్ దమేచా, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ ఛొకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మెర్చంట్‌లనూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ ఫోన్‌నూ అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సిన క్రూయిజ్ షిప్ శనివారం రాత్రి బయల్దేరింది. ఈ షిప్ ‘మ్యూజికల్ వోయేజ్’లో భాగంగా ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సి ఉన్నది.

అయితే, ఈ షిప్‌లో రేవ్ పార్టీ నిర్వహించనున్నట్టు, అందులో డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశముందని అధికారులకు 15 రోజుల కిందే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ షిప్‌లో ఢిల్లీ నుంచి ఓ బిజినెస్ మ్యాన్ కూతురు, మరో యువతి కూడా ఎక్కినట్టు తెలిసింది. వీరితోపాటు ఆర్యన్ ఖాన్ కూడా షిప్‌లో ఉన్నారు.

డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అనుమానాలున్నవారిని అందరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షిప్ కెప్టెన్ దగ్గరకు వెళ్లి వెంటనే షిప్ వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ కేసులో షిప్ నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంతో కుడెలవుతున్న సినీ పరిశ్రమలకు షారుఖ్ ఖాన్ కుమారుడు రేవ్ పార్టీలో ఉండటం కలకలం రేపుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...