గతనెల హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈమధ్య సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అప్ డేట్ లేని సంగతి తెలిసిందే. ఈక్రమంలో దేవ్ కట్టా దర్శకత్వంలో తాను హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా విజయంపై పరిశ్రమ, మెగా ఫాన్స్ సంతోషంతో ఉన్నారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ కూడా స్పందించాడు. ట్విట్టర్ లో సినిమా విజయంపై స్పందించాడు. ‘సినిమాకు అద్భుత విజయం చేకూర్చిన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. నిజానికి ఈ పదం చాలా చిన్నది. త్వరలోనే మీముందుకు వస్తాను’ అంటూ ధమ్స్ అప్ సింబల్ చూపిస్తూ.. మెసేజ్, పిక్ పోస్ట్ చేసాడు. ఈ పిక్ లో తేజ్ కనిపించలేదు.
దీంతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అందరికీ క్లారిటీ కూడా వచ్చినట్టైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ విజయవంతం కావడంతో సంతోషంగా ఉన్నాడని చెప్పాలి.
Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
See you soon pic.twitter.com/0PvIyovZn3— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021