భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే దానికి ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దేశాల క్రీడాభిమానులే కాకుండా మిగిలిన దేశాలు కూడా ఆసక్తికరంగా ఆ మ్యాచ్ వీక్షిస్తాయ్. అయితే, ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఐసీసీ టోర్నీ లేదా ఆసియా కప్ వంటి ఈవెంట్లలో తప్ప.. రెండు జట్లూ ద్వైపాక్షిక సిరీస్ ఆడడంలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దాయాది దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లో ఆడనున్నాయనే వార్త ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ ఏడాది రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలో భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ కు సిద్ధంగా ఉండాలని పాక్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి సమాచారం అందినట్టు పాక్ మీడియా వెల్లడించింది. 2012-13లో వన్డే సిరీస్ కోసం పాక్ భారత్ లో పర్యటించింది. 2008లో ఆసియా కప్ లో ఆడటం కోసం చివరిసారిగా భారత్.. పాక్ వెళ్లింది. ఇక చివరి సారిగా ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డాయి.
736622 566690Some times its a discomfort within the ass to read what weblog owners wrote but this internet internet site is actually user genial ! . 207738
894711 246182Appreciate it for helping out, superb details. 639385