Switch to English

రిపబ్లిక్ టీవీ ఉవాచ: జగన్ సన్నిహితుల ఆర్థిక అక్రమాలపై కేంద్రం గుస్సా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితులైన కొందరు వైసీపీ ముఖ్య నేతల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టిందా.? ఆయా వ్యక్తులు నిర్వహిస్తోన్న సంస్థల ‘ఆర్థిక వ్యవహారాల్లో లొసుగుల్ని’ కేంద్రం గుర్తించిందా.? ఈ విషయమై కొందరు విదేశీయులు కేంద్రానికి ఫిర్యాదు చేశారా.? అసలేం జరుగుతోంది.?

బీజేపీ కనుసన్నల్లో నడిచే నేషనల్ మీడియా ఛానల్ ‘రిపబ్లిక్ టీవీ’ ప్రసారం చేసిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తెలుగు నాట పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితులు.. వైసీపీ ముఖ్య నేతలు.. ప్రభుత్వంలో కీలక పదవుల్లో వున్నవారు..’ అంటూ నేషనల్ మీడియా ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడమే కాదు, ‘వైఎస్ జగన్‌కి సమస్యలు రాబోతున్నాయ్..’ అంటూ అనుమానాలు వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

వైఎస్ జగన్ చాలాకాలంగా అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. పలు కేసులు విచారణలో వున్నాయి కూడా. కొన్నాళ్ళు ఆయన జైల్లో వుండాల్సి వచ్చింది ఈ కేసుల నిమిత్తం. ‘రెండేళ్ళలో జగన్ సర్కార్ కూలిపోతుంది..’ అంటూ కొన్నాళ్ళ క్రితం బీజేపీకి చెందిన కొందరు నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

2021లోనే ఆ రాజకీయ మార్పు చోటు చేసుకోబోతోందని అప్పట్లో ఆ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. అదే నిజమవుతుందా.? ఆ కారణంగానే కేంద్రం, రాష్ట్రానికి సంబంధించి ప్రతిసారీ నిర్లక్ష్యం వహిస్తున్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజా కేంద్ర బడ్జెట్ విషయంలో కావొచ్చు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కావొచ్చు.. ఇంకే విషయంలో అయినా కావొచ్చు.. కేంద్రాన్ని జగన్ నేరుగా నిలదీయలేకపోతుండడానికి కారణం తన మీద కేంద్రం పెట్టిన ప్రత్యేక దృష్టేనని విపక్షాలు విమర్శిస్తున్న విషయం విదితమే.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అందునా మోడీ సర్కార్ జమానాలో.. ఏ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలాగైనా మారిపోవచ్చు. అంతా బాగానే వుందిగానీ, ఇంతవరకు ‘యెల్లో’ మీడియాకి ఈ వ్యవహారాలపై ఉప్పందలేదెందుకో.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...