Switch to English

పిచ్చి కుక్కలు కరుస్తాయ్.. వైసీపీపై జనసేన పవర్ పంచ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం.. అందులో ఓ చిన్న గ్రామం.. దాని పేరు మత్స్యపురి. అధికార వైసీపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా, అక్కడ జనసేన జెండా ఎగిరింది పంచాయితీ ఎన్నికల్లో. ఇంకేముంది.? ఎలాగైనా, అక్కడి జనసైనికుల్ని భయపెట్టాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై అధిష్టానం నుంచి ఒత్తడి పెరిగినట్టుంది. లేదంటే, తన అహం దెబ్బతిందన్న కారణంతో అధిష్టానం వద్ద తన ఇమేజ్ పెంచుకోడానికి, ఆ గ్రామంలో వైసీపీ గూండాలతో ‘కవాతు’ చేయించినట్టున్నారు సదరు ఎమ్మెల్యే.

పవన్ కళ్యాణ్ వస్తాడో.. డాష్ డాష్ బాబు వస్తాడో చూస్తా.. గ్రామంలో జనసైనికుడనేవాడే లేకుండా చేస్తా.. మీకెవడ్రా దిక్కు ఇక్కడ..’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడిపోయారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ‘అక్కుపక్షి’ మీడియా (అధికార పార్టీకి చెందిన బులుగు మీడియా) కులం రంగు పులిమింది. దళితులపై దాడులనీ, అంబేద్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ అనీ.. అటు వైసీపీ, ఇటు వైసీపీ అను‘కుల’మీడియా కథనాల్ని వండి వడ్డించింది.

గ్రామంలో అసలంటూ జనసైనికులు వుండకూదన్న రీతిలో అక్కడ అత్యంత జుగుప్సాకరమైన, భయానకమైన పరిస్థితుల్ని అధికార పార్టీ పెంచి పోషిస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘మనం రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం తిరిగి కరవం కదా.. మునిసిపాలిటీ వ్యాన్ వచ్చేవరకు వేచి చూసి, పిచ్చి కుక్కని మునిసిపాలిటీ వ్యాన్‌లో పడేస్తాం..’ అలాగే, ఇప్పుడు కూడా సంయమనం పాటించండి.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు.

‘మా పార్టీకి చెందినవారిపై అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఆ ఒత్తిళ్ళకు పోలీసులు లొంగకూడదు..’ అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి విజ్ఞప్తి చేశారు జనసేనాని. ‘ప్రత్యర్థులను హింసించడమే వైసీపీ నేతల పని. 151 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ప్రజల్ని హింసించే పనిలో వున్నారు..’ అంటూ జనసేన అధినేత మండిపడ్డారు. ‘ఆయనో ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసే వ్యక్తి.. ఆయన మంచిగా ప్రవర్తిస్తాడని మనం ఆశించలేం’ అని జనసేనాని ఎద్దేవా చేశారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...