Switch to English

రాజధానిగా విశాఖ: వైసీపీ ఒప్పందం ఎవరితో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నంని రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఖరారు చేసిందనీ, దీన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి కుండబద్దలుగొట్టేశారు. ‘విశాఖ రాజధాని విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడాం..’ అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ‘ఏకైక రాజధాని అమరావతి మాత్రమే’ అంటున్నారు. ఇప్పటిదాకా బీజేపీలోని వైసీపీ వర్గం నేతలుగా ముద్రపడ్డ కొందరు బీజేపీ నేతలు కూడా, సోము వీర్రాజు వాదనతో ఏకీభవించడమే కాదు, సోము వీర్రాజు లైన్‌లోనే ‘అమరావతి నుంచి రాజధానిని తరలించడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వల్ల కాదు..’ అని తెగేసి చెబుతున్నారు. అంటే, బీజేపీ అధిష్టానం నుంచి ఈ విషయమై రాష్ట్ర బీజేపీ నేతలకు ఖచ్చితమైన సమాచారం వుందన్నమాట.

అదే నిజమైతే, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విషయమై వైసీపీ ఎవర్ని సంప్రదించినట్లు.? ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదించాకనే, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా వైసీపీ నిర్ణయించిందా.? మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలు, ‘అమరావతికి జై’ అంటున్నారా.? మొత్తమ్మీద, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలిప్పుడు బీజేపీలో అంతర్గతంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. విజయసాయి వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదనీ, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో వుందనీ, బీజేపీ నినాదం అమరావతి రాజధాని మాత్రమేననీ ఏపీ బీజేపీ కుండబద్దలుగొట్టి మరీ చెప్పేస్తోంది.

అయితే, హైకోర్టును మాత్రం రాయలసీమకు ఇవ్వాలనీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలనీ బీజేపీ నినదిస్తుండడం గమనార్హం. కానీ, హైకోర్టు మార్చాలంటే.. అది కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనే జరగాలి.. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి.. సుప్రీంకోర్టు పరిధిలోని అంశం కూడా. ఆ సంగతి వైసీపీకి కూడా బాగా తెలుసు. కానీ, అసెంబ్లీలో చట్టం చేసేసి ‘జ్యుడీషియల్‌ క్యాపిటల్‌’ అంటూ వైసీపీ ప్రభుత్వం ఎలా ప్రకటించేసిందట.? ఇంతా చేసి, ‘అది ప్రతిపాదన మాత్రమే..’ అని హైకోర్టుకి ఎలా వైసీపీ ప్రభుత్వం సమాచారమిచ్చిందట.? చాలా ప్రశ్నలున్నాయ్‌.. కానీ, సమాధానాలే దొరకడంలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...