రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం పీరియాడిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకాబోతోంది. రాధే శ్యామ్ టీమ్ ఇటలీకి ప్రయాణమయ్యారు. ఈ నెలాఖరు దాకా రాధే శ్యామ్ ఇటలీ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. రాధే శ్యామ్ తర్వాత ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు లైన్లో ఉన్నాయి.
ఇక ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23)కు ఎన్నో రోజులు లేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ అభిమానులకు ఆరోజు స్పెషల్ సర్ప్రైజ్ లు బోలెడు ఉండనున్నాయి. ముందుగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ కానీ టీజర్ కానీ విడుదల చేస్తారు. ఇక ఆది పురుష్ లో ఇప్పటికే లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తాడని అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 23న మిగతా పాత్రధారుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టైటిల్ ను అదే రోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ జరిగితే మాత్రం ప్రభాస్ అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
288577 968826I surely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 283693