కొద్ది రోజుల క్రితం వైసీపీకి చెందిన ఓ మంత్రిగారు ‘కారు’ వివాదంలో ఇరుక్కున్నారు. తమిళనాడు పోలీసులు పట్టుకున్న ఓ కారులో 5 కోట్ల రూపాయల నగదు దొరకడం, ఆ కారు ఓ మంత్రిగారి అనుచరుడిది కావడం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ ఘటన పెను ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. ఈ మధ్యనే ఓ మంత్రిగారి చుట్టూ ‘బెంజి కారు’ వివాదం రాజకీయ రచ్చకు కారణమైంది.
తాజాగా వైసీపీకి చెందిన మరో మహిళా నేత కారులో తెలంగాణ మద్యం దొరకడం పెను సంచలనాన్ని సృష్టించింది. ‘ఆ కారు నాదే, కానీ.. అందులో వున్న మద్యం బాటిళ్ళతో నాకు సంబంధం లేదు..’ అని సదరు మహిళా నేత వ్యాఖ్యానించడం గమనార్హం. దుర్గ గుడి పాలక మండలి సభ్యురాలి కారు అది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమె తన పదవికి రాజీనామా కూడా చేసేశారు.
ఓ కారు.. ఆ వెంటనే ఇంకో కారు.. మళ్ళీ మరో కారు.. ఇలా కార్లు, వైసీపీ నేతల్ని ఎందుకు వెంటాడుతున్నట్లు.? 2019 ఎన్నికల్లో ‘ఫ్యాను’ గుర్తుకి తెరవెనుకాల సహాయ సహకారాలు అందించింది కూడా ‘కారు’ కావడం గమనార్హం. కారుకీ, ఫ్యానుకీ మధ్య రాజకీయంగా ఈ మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ళ గొడవల నేపథ్యంలో ఫ్యాను మీద కారు.. కారు మీద ఫ్యాను.. గుస్సా అవుతున్న విషయం విదితమే.
అయినా, దుర్గ గుడి పవిత్రతను చెడగొట్టేలా ‘పాలక మండలి’ బ్యాడ్జీ వున్న కారులో మద్యం అక్రమ తరలింపేమిటి.? దేవాలయాల పాలక మండళ్ళు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని హిందూ సమాజం ఆవేదన చెందుతోన్నది ఇందుకే.
అన్నట్టు, దుర్గ గుడికి సంబంధించి రధం తాలూకు వెండి సింహాల మాయం వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. చంద్రబాబు హయాంలో కాదు, వైఎస్ హయాంలోనే ఆ విగ్రహాలు మాయమయ్యాయంటూ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
691453 410929Pretty section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact enjoyed account your weblog posts. Any way I will be subscribing to your augment and even I achievement you access consistently quickly. 10015
622016 30762Im agitated all these article directories. It confident would be nice to have every article directory that instantly accepts articles. 428618