Switch to English

కరోనా డేంజర్‌ బెల్స్‌.. రికార్డుల పేరుతో పబ్లిసిటీ స్టంట్స్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేసేస్తోందట. ‘బ్లూ మీడియా’ ఇస్తోన్న కితాబులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్‌.. వెరసి ప్రజలకు గ్రౌండ్‌ రియాల్టీ అర్థం కావడంలేదని ఎవరైనా భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదు. తెలంగాణతో పోల్చితే, వైద్య రంగం పరంగా సౌకర్యాలు తక్కువే వున్నా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు అత్యధిక సంఖ్యలో జరుగుతుండడాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే, టెస్టులు చేస్తే కరోనా నియంత్రించగలం.. అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. రోజురోజుకీ సరికొత్త రికార్డులంటూ టెస్టుల చుట్టూనే అధికార పక్షం ప్రచారం చేసుకుంటోంది. కానీ, గ్రౌండ్‌ రియాల్టీ వేరు.

గడచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో సగటున 10 వేల కరోనా పాజిటివ్‌ కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఈ మ్యాజిక్‌ మార్క్‌ చేరుకున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. తమిళనాడు సంగతి సరే సరి. కర్నాటకలోనూ రికార్డు స్థాయిలోనే టెస్టులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర కూడా ముందంజలోనే వుంది. కానీ, ఆ రాష్ట్రాలేవీ టెస్టుల విషయంలో పబ్లిసిటీ స్టంట్లు చేయడంలేదు.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ తప్ప. ఎందుకిలా.? టెస్టులు చేస్తే కరోనా అదుపులోకి వస్తుందా.? ఇదెక్కడి వైపరీత్యం.? పైగా, అధికార పార్టీ నేతలు కరోనా రాగానే ఎంచక్కా హైద్రాబాద్‌కి పారిపోతున్నారు. దేశంలో దాదాపుగా ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు. అధికార పార్టీ నేతలకు తమ సొంత రాష్ట్రంలో వైద్య సౌకర్యాలపై అంత అనుమానమా.? అన్న చర్చ ప్రజల్లో జరగకుండా ఎలా వుంటుంది.? ఈ లెక్కన, ప్రజలకు ధైర్యం ఎలా వస్తుంది.?

అందుకే, కరోనా సోకిందని తెలియగానే.. వీలైతే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోదామన్న భావనలో ఓ మోస్తరు అవకాశమున్న ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది రాష్ట్ర పరువ ప్రతిష్టలకు సంబంధించిన విషయం. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవడమే కాదు, గడచిన కొద్ది రోజులుగా కరోనా మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే సంభవిస్తున్నాయి. అయినా, ‘అత్యద్భుతంగా పనిచేసేస్తున్నాం..’ అని అధికార పార్టీ నేతలు ‘సొంత డప్పు’ కొట్టుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెండు లక్షలు దాటేశాయి. మూడు లక్షల మార్క్‌ చేసుకోవడానికి జస్ట్‌ ఓ పది రోజుల కంటే ఎక్కువ పట్టే అవకాశమే లేదు. ఆ తర్వాతేంటి.? కరోనా నియంత్రణ మీద దృష్టిపెట్టకుండా, కేవలం టెస్టుల మీద ఫోకస్‌ పెట్టడంతోనే ఈ దుస్థితి.. అన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...