Switch to English

వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై దాపరికమెందుకు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై అటు మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఇటు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వాస్తవంగా ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని వరవరరావు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరవరరావు ఆరోగ్యం ఎలా ఉందో దాపరికం లేకుండా వాస్తవ పరిస్థితి తెలియజేయాలని ఆయన భార్య హేమలత, కుమార్తెలు మహా సర్కారుకు లేఖ కూడా రాశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులమైన తమకు కూడా చెప్పకపోవడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా అక్రమం, అమానవీయమని విమర్శించారు.

ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిందని మాత్రమే అధికారికంగా వెల్లడించారని.. ఇతరత్రా అన్ని విషయాలు తమ మరో మార్గం ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో వెంటనే తెలియజేయాలని కోరారు. మరోవైపు ఇదే విషయంపై బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించారు. తమకు తెలిసిన సమాచారం మేరకు వరవరరావు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. జేజే ఆస్పత్రిలో ఆయన తలకు గాయం కావడంతో అక్కడ నుంచి నానావతి ఆస్పత్రికి తరలించారని వరవరరావు తరఫు లాయర్ కోర్టుకు నివేదించారు. ఆయన ఎలా ఉన్నారనే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడంలేదని తెలిపారు. వరవరరావు చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించేలా ఆదేశించాలని కోరారు.

దీంతో బాంబే హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థతోపాటు మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీచేసింది. వరవరరావు వాస్తవ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై బుధవారంలోగా తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కరోనా నేపథ్యంలో నిర్దేశిత దూరం నుంచి వరవరరావును చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వగలరో లేదో కూడా చెప్పాలని సూచించింది.

ఎల్గర్ పరిషత్ కేసులో 2018 జూన్ 6న అరెస్టైన వరవరరావు.. అప్పటి నుంచి మహారాష్ట్ర జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తొలుత జేజే ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి నానావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేనందున తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...