Switch to English

ఈసీ చేతకానితనానికి శిక్ష మేం అనుభవించాలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల సంఘం చేతకానితనానికి శిక్ష తాము అనుభవించాలా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం పోలింగ్ జరిగిన తీరుపై శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

ఈవీఎంలు పనిచేయకపోతే మరో ఈవీఎంను మార్చారని, ఇందులో విశ్వసనీయత ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంత పనికిమాలిన ఈసీని తాను ఇంతవరకు చూడలేదన్నారు. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కూడా తన ఓటు వేసుకోలేకపోయారని గుర్తుచేశారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ.. అలా చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణలో ఏకంగా 25 లక్షల ఓట్లు తొలగించి క్షమాపణ చెప్పారని విమర్శించారు. క్షమాపణ చెబితే సరిపోయే అంశమా ఇది అని ప్రశ్నించారు.

ఈవీఎంలను మానిప్యులేట్ చేయడం సులభమని, ఎవరికి ఓటేస్తే, అది ఎవరికి పడుతుందో దాన్ని రూపొందించిన ప్రోగ్రామర్ కి తప్ప మరెవరికీ తెలియదన్నారు. తన ఓటు కూడా తనకు పడిందో లేదో అని వ్యాఖ్యానించారు. అందుకే తాము బ్యాలెట్ ఎన్నికల కోసం పోరాడుతున్నామని చెప్పారు. తనకు టైమ్ లేకుండా ఎన్నికలు పెట్టి దెబ్బ తీయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు.

గత ఎన్నికల్లో చివరి విడతలో ఎన్నికలు జరగ్గా.. ఈసారి కావాలనే మొదటి విడతలో పెట్టారని విమర్శించారు. ప్రధాని మోదీ చెప్పినట్టే ఎన్నికల సంఘం పనిచేస్తోందని దుయ్యబట్టారు. అసలు ఏ ప్రాతిపదికగా తొలి విడతలో ఎన్నికలు పెట్టారో చెప్పాలన్నారు. పార్టీలతో మాట్లాడారా? లేక లాటరీ వేశారా? అని నిలదీశారు. తన ప్రశ్నలన్నింటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు.

శనివారం తాను ఢిల్లీ వెళ్తున్నానని, ఎన్నికల సంఘాన్ని కలిసి ఇవన్నీ అడుగుతానని చెప్పారు. తనతోపాటు తన ఎంపీలు, మంత్రులందరినీ తీసుకెళ్తానని పేర్కొన్నారు. సేవ్ డెమొక్రసీ-సేవ్ ఇండియా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ప్రణాళిక ప్రకారమే అల్లర్లు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిన దాడులు కావని, అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయన్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందని తాము ముందుగానే హెచ్చరించామని.. అయినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులను ఈసీ మార్చేసిందని విమర్శించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న తాను.. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఆర్థిక నేరగాడు జగన్ తో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన ఎన్నికలకు మూడు రోజుల ముందు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ లోటస్ పాండ్ లో కుట్రలకు ప్రణాళికలు రచించారని బాబు ఆరోపించారు. నిన్న పోలింగ్ కూడా పూర్తి కాకుండానే లోటస్ పాండ్ కు వెళ్లిపోయారని, ఫలితాల తర్వాత కూడా అక్కడే ఉంటారా అని ప్రశ్నించారు.

కాగా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, ఓటింగ్ లో పాల్గొనకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. వారంతా కసితో ఓటేశారని చంద్రబాబు అభినందించారు. రాత్రి వరకు క్యూలో ఉండి ఓటేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని అనుకుంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. రేపు మీరే చూస్తారుగా అని బాబు బదులిచ్చారు. గురువారం అర్ధరాత్రి జరిగిన టెలికాన్ఫరెన్స్ లో 130 స్థానాలు గెలుస్తామని చెప్పిన చంద్రబాబు.. తాజాగా మాత్రం సంఖ్య చెప్పకపోవడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...