Switch to English

ట్రంప్‌ అత్యుత్సాహం.. నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా మరి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. ఎంత గొప్ప సన్నిహితుడంటే, ‘మాకు గనుక హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను భారతదేశం ఇవ్వకపోతే, మా తడాఖా ఏంటో భారతదేశానికి చూపిస్తాం..’ అని నోరు పారేసుకునేంతగా.! ఇటీవల భారత్‌లో పర్యటించిన ట్రంప్‌, నరేంద్ర మోడీని స్నేహితుడిగా పేర్కొంటూనే, పాకిస్తాన్‌ మీద వల్లమాలిన ప్రేమ ప్రదర్శించడం అప్పట్లోనే చర్చనీయాంశమయ్యింది.

ట్రంప్‌ – నరేంద్ర మోడీ మధ్య స్నేహం మాటేమోగానీ, పూటకో మాట మార్చే ట్రంప్‌, ఇప్పుడు భారత్‌ – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాను ఇరుదేశాలకూ మద్యవర్తిగా వుంటానంటున్నారు. నిజానికి, గతంలో పాక్‌ – భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడూ ట్రంప్‌ ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారుగానీ.. అప్పట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ‘పెద్దన్న’ మద్యవర్తిత్వానికి ససేమిరా అన్నారు.

కాశ్మీర్‌ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని పలు మార్లు భారత్‌ స్పష్టం చేసింది. ఆ కాశ్మీర్‌కి పక్కనే వున్న (ఇటీవల వేరుపడ్డ) లడఖ్‌ విషయమై చైనా ఇప్పుడు నానా యాగీ చేస్తోంది. లడఖ్‌లోని కొంత భాగాన్ని అక్సాయ్‌ చిన్‌గా పిలుస్తున్నాం. అదే చైనా ఆక్రమిత కాశ్మీర్‌. దాన్ని దాటి, భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకురావడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైంది.

భారతదేశం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, చైనాకి ధీటైన సమాధానం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మద్యవర్తిత్వానికి దిగుతానంటున్నారు. చైనాతో అమెరికాకి సన్నిహిత సంబంధాలేమైనా వున్నాయా.? లేవు కదా.! కరోనా వైరస్‌ని చైనా వైరస్‌గా డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే అభివర్ణించారు. అమెరికా – చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది.

అయితే, చైనా – అమెరికా మధ్య సరిహద్దు గొడవలేమీ లేవనుకోండి.. అది వేరే విషయం. అయినాగానీ, చైనా.. అమెరికాని టార్గెట్‌ చేసేలా అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదన ఎప్పటినుంచో వుంది. అలా చైనా – అమెరికా చాలాకాలంగా మాటల యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మద్యవర్తిత్వం వహిస్తానంటే చైనా మాత్రం ఒప్పుకుంటుందా.? ఛాన్సే లేదు. అయినా, భారత్‌ ఆ అవకాశాన్ని అమెరికాకి ఎందుకిస్తుంది.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....