Switch to English

హెరిటేజ్ నాదే.. బాబు లాక్కున్నారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై కలెక్షన్ కింగ్, వైఎస్సార్ సీపీ నేత మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుది వాడుకుని వదిలేసే విధానమని నిప్పులు చెరిగారు. తనను నమ్మినవారందరినీ మోసం చేయడం ఆయన నైజమని తూర్పారబట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ సహా ఎంతోమందిని బాబు నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. బాబుని నమ్మినందుకు తనను కూడా మోసగించారని, అదో పెద్ద చరిత్ర అని మోహన్ బాబు తెలిపారు.

వాస్తవానికి హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదని, తన సంస్థను ఆయన మోసపూరితంగా లాక్కున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హీరోగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు, దాగా అనే మరో స్నేహితుడితో కలిసి హెరిటేజ్ సంస్థ స్థాపించానని మోహన్ బాబు వివరించారు. అందరికంటే తనదే ఎక్కువ శాతం వాటా కాగా, చంద్రబాబుది కాస్త తక్కువ పెట్టుబడి అని, దాగాది ఇంకా తక్కువ పెట్టుబడి అని పేర్కొన్నారు.

సంస్థ స్థాపించిన కొన్నాళ్ల తర్వాత చంద్రబాబు తనచేత కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. అప్పట్లో తాను హీరోగా చాలా బిజీగా ఉన్నందున, ఇవేవీ అంతగా పట్టించుకునేవాడిని కాదని, చంద్రబాబు స్నేహితుడే కదా అని నమ్మి ఖాళీ పేపర్లపై సంతకాలు చేశానని, వాటిని ఉపయోగించుకుని హెరిటేజ్ ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ‘ఖాళీ పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత హెరిటేజ్ సంస్థతో నీకు సంబంధం లేదని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యాను.

నాకు అన్యాయం జరగడంతో కోర్టుకు కూడా వెళ్లాను. ఆ కేసు చాలాకాలం కొనసాగింది. అయితే, బాబు రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం వల్ల ఆయనతో పెట్టుకుంటే మనం గెలవలేమని నా సన్నిహితులు చెప్పడంతో కేసు వదిలేశాను. హెరిటేజ్ లో పెట్టుబడి పెట్టిన దాగాను కూడా ఇదే రీతిలో మోసం చేసి బయటకు పంపేశారు’ అని మోహన్ బాబు వివరించారు. హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబు తనను, తన స్నేహితుడినే కాకుండా రైతులను కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.

తొలుత కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసి, ఆ సొమ్మును తనకు తెలిసిన కొంతమంది రైతులకు ఇచ్చేవారని, తద్వారా వారి పేర్లతో హెరిటేజ్ షేర్లు కొన్నట్టు రికార్డులు సృష్టించేవారని వివరించారు. కొన్నాళ్లకు ఆ షేర్లను తాను కొనుగోలు చేసినట్టుగా చంద్రబాబు పత్రాల్లో చూపించేవారని, ఈ విషయాలేవీ ఆ రైతులకు కూడా తెలియవని, చంద్రబాబు వ్యవహారం అలా ఉంటుందని పేర్కొన్నారు.

కేవలం పన్నులు తప్పించుకోవడం కోసమే అలా చేసేవారన్నారు. తనను మోసం చేసి హెరిటేజ్‌ సంస్థను తీసుకున్న చంద్రబాబు.. దాన్ని భారీ మొత్తానికి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని మోహన్ బాబు ధ్వజమెత్తారు. తాను చెప్పిన విషయం పూర్తిగా సత్యమని, ఈ విషయంలో తిరుపతి, కాణిపాకం లేదా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. మరి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి అలా చెప్పగలరా? అని సవాల్ చేశారు.

ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోహన్ బాబు తాజాగా హెరిటేజ్ కంపెనీపై వెల్లడించిన అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...