Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: 2 లక్షలా.? 2 వేల కోట్లా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అడ్డంగా బుక్కయిపోయారట.. 2 వేల కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయట.. ఆయన సన్నిహితులపై ఇటీవల ఐటీ సోదాల సందర్భంగా ‘పచ్చ పాపాల పుట్ట’ పగిలిందట.! ఇదీ గత కొద్ది రోజులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న మాట.

ఏంటీ.? కేవలం 2 వేల కోట్ల రూపాయల అక్రమాలు మాత్రమేనా.? అమరావతిలోనే వేల కోట్ల కుంభకోణానికి చంద్రబాబు అండ్‌ కో పాల్పడిందని ఆరోపిస్తున్న వైసీపీ, ఆదాయపు పన్ను శాఖ సోదాలపై అత్యుత్సాహం చూపుతుండడం కాస్త ఆలోచించాల్సిన విషయమే. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ, టీడీపీ మీద చాలా ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక కూడా అవే ఆరోపణల్ని వైసీపీ కొనసాగిస్తోంది టీడీపీ మీద. ఎన్నాళ్ళు.? ఇంకెన్నాళ్ళు ఈ అవినీతి ఆరోపణలు ఇలా కొనసాగుతాయి.? జనం విసుక్కుంటున్నారు రాష్ట్రంలో నీఛ నికృష్ట రాజకీయాలు చూసి.

అమరావతి అనేది ప్రస్తుతం వైసీపీ చేతుల్లోనే వుంది. దానర్థం, అమరావతికి సంబంధించిన భూములన్నీ ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే వున్నాయి. సో, అక్కడ జరిగిన అక్రమాలపై రాత్రికి రాత్రి కేసులు నమోదు చేసెయ్యొచ్చు. మాజీ మంత్రి నారాయణ బినామీల ద్వారా చంద్రబాబు వేల కోట్లు కొల్లగొట్టారన్నది వైసీపీ ఆరోపణ. ఆ ఆరోపణల్లో నిజాలు వుండి వుంటే, ఎప్పుడో చంద్రబాబు అండ్‌ టీవ్‌ు జైలుకు వెళ్ళేవారే. అమరావతి పేరుతో వైసీపీ, టీడీపీకి అద్దిన ‘మసి’ పెద్దగా ఫలితాన్నివ్వలేదేమో.. ఇప్పుడు ఐటీ శాఖ సోదాల పేరుతో కొత్తగా ‘రంగు’ అంటించే ప్రయత్నం జరుగుతోంది.

చంద్రబాబు హయాంలో అక్రమాలు జరగలేదని ఎవరూ అనలేరు. ఎందుకంటే, అమరావతి పేరుతో ఆయన చేసిన పబ్లిసిటీ స్టంట్లు అలాంటివి. ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ చేసిన ఖర్చు అలాంటిది. టీడీపీ కన్నా కాస్త ఎక్కువ ఖర్చు చేసింది వైసీపీ.. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. ఐటీ శాఖ సోదాల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద దాదాపు రెండున్నర లక్షల రూపాయల నగదు, పన్నెండు తులాల బంగారం మాత్రమే లభ్యమయ్యిందంటూ ఓ ‘రసీదు’ తెరపైకొచ్చింది.. ఇది ఐటీ శాఖ, సదరు శ్రీనివాస్‌కి ఇచ్చిన రసీదు.

కానీ, అదే ఐటీ శాఖ నుంచి మొత్తం సోదాల్లో 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు వెలుగు చూసినట్లు పేర్కొంది. సరిగ్గా తవ్వి తీస్తే 2 లక్షల కోట్ల రూపాయల అక్రమాలు బయటపడ్తాయనీ.. ఈ ప్రక్రియ మొదలైందనీ వైసీపీ ప్రచారం చేస్తోన్న విషయం విదితమే. ఇంతకీ ఈ కుంభకోణం రెండు లక్షల రూపాయలు మాత్రమేనా.? రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినదా.? వైసీపీ వద్ద ఆధారాలున్నప్పుడు, చట్ట ప్రకారం చంద్రబాబుని శిక్షించొచ్చు.

కానీ, వైసీపీ కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతోందంటే.. చంద్రబాబుతో లాలూచీ పడినట్లే అనుకోవాలి. ‘నేను కొట్టినట్లు హడావిడి చేస్తాను.. నువ్వు ఏడ్చినట్లు నటించు..’ అన్నట్టుంది వైసీపీ, టీడీపీ వ్యవహారం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...