Switch to English

ఒకే ఒక్క పదం మండలిని రద్దు చేయించింది తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఏపీ శాసనమండలిపైనే చర్చ జరుగుతోంది. ఏపీలోని అధికార పార్టీ పట్టుదల కారణంగా మండలి రద్దు దిశగా మంత్రాంగం నడుస్తోంది. ఈ సందర్భంగా గతంలో మండలి రద్దు అయిన సందర్భాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి ఏపీ శాసనమండలి రద్దు అయింది. అనంతరం వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దానిని పునరుద్ధరించారు.

అయితే, ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దు కావడానికి కారణం ఒకే ఒక్క పదం అని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అప్పట్లో టీడీపీకి మండలిలో బలం లేకపోవడం, కాంగ్రెస్ కు ఎక్కువ మంది సభ్యులు ఉన్నారనే కారణంతోనే మండలి రద్దుకు ఎన్టీఆర్ తీర్మానం చేసి పంపించారని చెబుతారు. ఇది ఒక కారణమైనప్పటికీ, ఇదే ప్రధాన కారణం కాదు.

ఎన్టీఆర్ నిర్ణయాలపై మండలిలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యేవి. ఆయన విధానాలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతుండేవారు. ఇది ఇలా కొనసాగుతున్న సమయంలో ఓ రోజు ‘పెద్దల గలాభా’ అని ఈనాడు పత్రికలో వార్త వచ్చింది. దీనిని మండలి తీవ్రంగా పరిగణించింది. అసలే కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక కావడంతో దానిపై చర్య తీసుకోవాలని భావించి.. వెంటనే ఈనాడు పత్రిక ఎడిటర్ ను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతి వరకు కూడా వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఎడిటర్ ను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ తతంగం అంతా సాగుతున్న సమయంలోనే మండలి రద్దుకు బీజం పడింది. తమకు తలనొప్పిగా మారిన మండలిని రద్దు చేయడమే మంచిదని భావించిన ఎన్టీఆర్.. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కానీ ఈ కేసు వివరాలు తెలుసుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అందుకు అంగీకరించలేదు.

అనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఆయనతో సంత్సంబంధాలు కలిగిన ఎన్టీఆర్ మండలిని రద్దు చేయించుకున్నారు. ఈ విషయాన్ని బుధవారం మాజీ మంత్రి యనమల కూడా ప్రస్తావించారు. 1984లో ఒక వార్త విషయంలో యాజమాన్యాన్ని మండలి ముందుకు పిలిపించడంపై రేగిన వివాదం మండలి రద్దుకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు.

కేవలం ఒక పదం విషయంలో నాడు మండలి తీవ్ర నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు జగన్ మీడియా రోజూ ఘోరమైన కథనాలు ప్రచురిస్తోందని విమర్శించే క్రమంలో యనమల ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అందించే ఎంసీజే కోర్సులోని పాఠ్యపుస్తకంలో కూడా పొందపరిచారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...