టాలీవుడ్ లో సంచలనం రేపిన అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు పరిశ్రంలోకి అడుగుపెట్టిన గ్లామర్ భామ షాలిని పాండే పై పోలీస్ కేసు నమోదైంది. అంతే కాదు ఆమె పై అటు ఫిలిం ఛాంబర్ లో కూడా కేసులు పెట్టారు. షాలిని పాండే పై పోలీస్ కేసు న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ గా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే .. అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయంతో షాలిని పాండే అంటే క్రేజ్ బాగా పెరిగింది. అందుకే ఈమెకు ఒక్క తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లో మంచి అవకాశాలే వచ్చాయి. తెలుగులో రెండు సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో కోలీవుడ్ లో ప్రయత్నాలు మొదలెట్టింది.
తాజాగా తమిళంలో విజయ్ ఆంటోనీ హీరోగా అగ్ని సిరాగుగల్ అనే ఓకే చెప్పింది. షూటింగ్ కూడా మొదలెట్టిన ఈ టీమ్ కు షాలిని షాక్ ఇచ్చింది. కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చిన షాలిని ఆ తరువాత షూటింగ్ కు రానని చెప్పిందట. మిగతా సన్నివేశాలు తీయాల్సి ఉందని అన్నా కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పిందట. నిర్మాత, దర్శకుడు ఎంతగా బతిమిలాడిన ఆమె నో చెప్పిందట. దాంతో చేసేదేమిలేక .. రెమ్యూనరేషన్ తీసుకుని షూటింగ్ కు రానని మోసం చేసిందంటూ సదరు నిర్మాత పోలీస్ కేసు పెట్టాడు. అంతే కాదు తెలుగు, తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా కేసు నమోదు చేసారు.
అయితే ఈ మద్యే షాలిని పాండే కు బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఇలా సౌత్ సినిమాలను పక్కన పెట్టిందని ప్రచారం జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ సరసన ఓ సినిమాలో అవకాశం రావడంతోనే ఈ తమిళ సినిమాను పక్కన పెట్టిందని అంటున్నారు. మరి ఈ విషయం పై షాలిని పాండే ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
73961 91717Hiya. Quite cool website!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your internet site and take the feeds additionallyI am happy to discover numerous valuable information here within the post. Thank you for sharing 548127
82531 551018Music began playing anytime I opened this website, so irritating! 831307
795054 869897An intriguing discussion will probably be worth comment. I think that you simply write significantly much more about this topic, it may possibly become a taboo topic but typically consumers are inadequate to communicate in on such topics. To one more. Cheers 176205